Political News

జనసేనలో కొమ్ములాట వెనుక ఉన్న కోవర్టులెవరు?

జ‌న‌సేన పార్టీకి సంబంధించి రాయ‌ల సీమ జిల్లాల వ్య‌వ‌హారాలు స‌మీక్షించ‌డంతోపాటు.. క్షేత్ర‌స్థాయిలో ఇంచార్జ్‌ల‌ను నియ‌మిం చేందుకు ఉద్దేశించిన స‌మావేశం ర‌చ్చ‌కు దారితీసింది. పార్టీలో కీల‌క నాయ‌కులుగా ఉన్న‌వారిని వ్య‌తిరేకిస్తూ.. కొంద‌రు నాయ‌కులు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు. స‌మావేశం నిర్వ‌హ‌ణ‌ను కూడా బ‌హిష్క‌రించారు. దీంతో జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌తంగా ముసురుకున్న వివాదాలు రోడ్డున ప‌డిన‌ట్టు అయింది. ముఖ్యంగా పార్టీలో వ్య‌వ‌స్థాప‌క స‌మ‌యం నుంచి ఉన్న నాయ‌కుల‌కుఎలాంటి గుర్తింపు లేకుండా పోయంద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.

అయితే.. ఇదంతా కూడా వైసీపీ నుంచి వ‌చ్చి.. జ‌న‌సేన‌లో చేరిన వారు చేస్తున్న కుట్ర‌ల‌ని.. మాజీ మంత్రి, రాయ‌ల‌సీమ జిల్లాల జ‌న‌సేన పార్టీ ఇంచార్జ్ బాలినేని శ్రీనివాస‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేద‌న్నారు. అయితే.. వాస్త‌వానికి ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే నాయ‌కులు గ‌ళం వినిపించ‌డం గ‌మ‌నార్హం. జనసేన పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేయాల‌ని.. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేయాల‌ని పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ క్ర‌మంలోనే జిల్లాల వారీగా స‌మీక్ష‌లు చేస్తున్నారు.

దీనిలో భాగంగా నిర్వ‌హించిన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం తీవ్ర ర‌చ్చ‌కు దారి తీసింది. సీనియ‌ర్ నాయ‌కులు, క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు మ‌ధ్య ఉన్న విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. వేర్వేరు పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు నేతలు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కడప జిల్లాకు చెందిన గుర్రప్పనాయుడు పార్టీ ఇన్‌ఛార్జుల తీరును ప్ర‌శ్నించారు. దీంతో ఆయ‌న వ్య‌వ‌హారంపై బాలినేని వ‌ర్గం తిర‌గ‌బ‌డింది. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు.. జిల్లాలకు ప్ర‌స్తుతం ఉన్న ప్రెసిడెంట్ల‌ను తీసేయాల‌ని.. పార్టీలో ఆది నుంచి ప‌నిచేస్తున్న వారికి అవ‌కాశం ఇవ్వాల‌నికోరారు.

ముఖ్యంగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ హ‌రి ప్ర‌సాద్‌లు కూడా.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఈ ప‌రిణామాల‌తో బాలినేని స‌హా అంద‌రూ విస్తుబోయారు. ఇదంతా పార్టీలో వైసీపీ నుంచి వ‌చ్చిన నాయ‌కుల వ‌ల్లే జ‌రుగుతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వారే కోవ‌ర్టులుగా మారి పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తున్నార‌ని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానించారు. తాజా ప‌రిణామాల‌పై పార్టీ అధిష్టానానికి స‌మాచారం ఇస్తామ‌ని.. ఇలాంటి నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకునే చూస్తామ‌ని సీనియ‌ర్లు తెలిపారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో త‌మ‌పై ఆధిప‌త్యం చేస్తే స‌హించేది లేద‌ని మ‌రికొంద‌రు నాయ‌కులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 10, 2026 11:07 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

9 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

9 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

22 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago