Political News

ముఖ్య‌మంత్రిగా మూడు సంత‌కాలు.. విజ‌య్ అద‌ర‌హో!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా టీవీకే పార్టీ(త‌మిళ వెట్రిగ క‌ళ‌గం) అధినేత సీ. జోసెఫ్ విజ‌య్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌.. ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. విజ‌య్‌తోపాటు.. సీనియ‌ర్ నాయ‌కులు కూడా కొంద‌రు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు.

అయితే.. తొలిరోజే విజ‌య్‌.. మూడు కీల‌క హామీల‌పై సంత‌కాలు చేసి అద‌ర‌హో అనిపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంత‌కం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుపై రెండో సంత‌కం చేశారు. త‌ద్వారా రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న సంకేతాన్ని ఆయ‌న తొలిరోజే పంపించారు.

ఇక‌, దేశాన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల‌కు త‌ల‌నొప్పిగా మారిన డ్ర‌గ్స్ భూతాన్ని త‌రిమికొట్టేందుకు.. ఉద్దేశించిన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసే ఫైలుపై మూడో సంత‌కం చేశారు. త‌ద్వారా ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణలో ఉన్న ఈగ‌ల్‌ వంటివ్య‌వ‌స్థ‌ను విజ‌య్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. ఈ మూడు హామీల‌ను కూడా.. విజ‌య్ ఎన్నిక‌లకు ముందే ప్ర‌క‌టించారు. తాజాగా వీటిని అమ‌లుచేస్తూ.. విజ‌య్ సంత‌కాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా, విజ‌య్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు కాంగ్రెస్ ప్ర‌ముఖ నాయ‌కులు కూడా వ‌చ్చారు. వీరితో విజ‌య్ స్వ‌యంగా సెల్ఫీలు తీసుకున్నారు. వీడియో చిత్రించారు. ఇక‌, ప్ర‌మాణ స్వీకారం అనంతరం.. గ‌వ‌ర్న‌ర్ అర్లేక‌ర్‌.. విజ‌య్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. పుష్ప‌గుచ్ఛాలు అందించి.. మంచి పాల‌న అందించాల‌ని సూచించారు. ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా.. ఎక్స్‌లో శుభాకాంక్ష‌లు తెలిపారు.

Kumar

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

53 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

2 hours ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

3 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

3 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

3 hours ago