టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన రచయితల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. 90వ దశకంలో పరుచూరి సోదరుల తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది ఆయనే. ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగానూ మారి ప్రతిభ చాటుకున్నారు. ఒక దశలో నటుడిగా తీరిక లేకుండా సినిమాలు చేశారు. ఆపై రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. వైసీపీ కోసం పని చేశారు. కానీ వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీల మీద తీవ్ర స్థాయిలో నోరు పారేసుకున్న ఆయన.. అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడిన ఫలితంగా అనేక కేసులు ఎదుర్కొని కొన్ని రోజులు జైలు జీవితం గడిపి వచ్చారు. ఐతే జైలు నుంచి బయటికి వచ్చాక పోసాని రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. కొంత కాలం అసలు ఎక్కడా కనిపించనే లేదు. ఐతే ఈ మధ్యే పోసాని తిరిగి దర్శకత్వం చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాణం.. ఇలా అన్ని బాధ్యతలూ తనే తీసుకున్నాడు పోసాని.
తాజాగా ఒక ప్రెస్ మీట్లో పోసాని తాను తీస్తున్న సినిమా గురించి మాట్లాడారు. ఐతే గతంలో పోసాని తీసిన చిత్రాల్లో రాజకీయ అంశాలు ఉన్న నేపథ్యంలో కొత్త చిత్రం కూడా ఇదే తీరుగా ఉంటుందా అని అడిగితే.. ఆయన వామ్మో అంటూ దండం పెట్టేశారు. ‘‘ఈ సినిమాకు రాజకీయాలతో సంబంధమే లేదు. నేను చాన్నాళ్ల తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా.. నన్ను రోడ్డు మీద పడేయబాకండబ్బా’’ అంటూ పోసాని విలేకరులందరినీ నవ్వించారు.
గతంలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లడం గురించి ఆయన స్పందిస్తూ.. ‘‘ప్రజాసేవలో ఉండాలంటే సేవా చేయాలి. జైలుకూ వెళ్లాలి. తప్పేమీ లేదు. ఇప్పుడు మాత్రం నన్ను కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా’’ అన్నారు. పోసాని దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ అప్పట్లో రాజకీయంగానూ సంచలనం రేపింది. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోసాని వ్యక్తిగతంగా కానీ, సినిమాల పరంగా కానీ ఎంతమాత్రం రాజకీయాల జోలికి వెళ్లే అవకాశం లేదన్నది స్పష్టం.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…