వచ్చే 2029లో యువతకు పెద్దపీట వేయాలని టీడీపీ నిర్ణయించింది. ముఖ్యంగా సగానికిపైగా స్థానాల్లో యువతకు ప్రాదాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పెద్ద ఎత్తున యువతకు అవకాశం ఇస్తున్న పార్టీగా టీడీపీ అవతరించే అవకాశం ఉంది. ఇదేసమయంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను తీసుకునే అవకాశం ఉన్నా.. ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా ఈ విషయంపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
సీనియర్లు-జూనియర్లు.. కలగలిపి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. వాస్తవానికి అనుకున్న సంఖ్య కంటే కూడా.. యువతకు తక్కువగానే టికెట్లు ఇచ్చారు. కానీ.. ఈ దఫా మాత్రం అనుకున్న సంఖ్యను అనుకు న్నట్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. అంటే.. ప్రస్తుతం ఉన్న సీట్లు 175 అలానే కొనసాగితే.. దాదా పు 80కిపైగా స్థానాల్లో కొత్తవారికి.. యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే.. ఎక్కువగా యువత, సామాన్యులే విజయం దక్కించుకున్నారు.
ప్రజలు కూడా సింపతీ కోణంలోనే ఆలోచించిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో సింపతీని దూసుకు నేందుకు స్థానికంగా చేతివృత్తులు చేసుకునేవారు.. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్నవారిని వెతికి పట్టుకుని.. వారికి 10 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్నయించుకున్నట్టు బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయి. ఎవరికి వారే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నా.. అంతిమంగా.. ఉమ్మడి నిర్ణయం ప్రకారం ముందుకుసాగాలని నిర్ణయించుకున్నాయి. ఇది పార్టీలకు.. సమాజంలో ఉన్న ప్రజల నాడిని పట్టుకునేందుకు అవకాశం దక్కుతుంది.
ఇక, యువతకు పెద్దపీట వేసే క్రమంలో అందరికీ అవకాశం ఇవ్వకుండా.. వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుని.. ఈ ఫార్ములాను అమలు చేయాలని టీడీపీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది.
అంటే.. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను క్లస్టర్ల వారీగా విభజించి యువతకు అప్పగిస్తారు. వారు విజయం దక్కించుకుంటే.. అలాంటి వారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి.. అసెంబ్లీకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏదేమైనా యువతకు అవకాశం అంటే.. దీనికి కూడా ఒక లెక్క ఉంటుందని స్పష్టమవుతోంది.
This post was last modified on May 7, 2026 12:47 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…