వాహనాలను ఛేజ్ చేయడాన్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇక రియల్ లైఫ్ లో కూడా అక్కడక్కడ వెహికిల్ ఛేజ్ ఘటనలు చోటుచేసుకుంటున్నా… వాటిని ఛేజ్ చేసే వారు పోలీసులే అయి ఉంటారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సర్కారీ ఆధీనంలోని ఆర్టీసీ బస్సును ఛేజ్ చేశారు.
ప్రయాణికులతో స్పీడుగా వెళుతున్న ఆ బస్సును తన కారుతో వెంబడించిన సదరు ఎమ్మెల్యే బస్సును ఆపారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కంకిపాడు, పెనమలూరు మధ్యన గురువారం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ఛేజ్ చేసింది మరోవరో కాదు… పెనమలూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బోడె ప్రసాద్ ఆ బస్సును ఆపారు.
ఈ ఛేజింగ్ సీన్ దేనికన్నవిషయానికి వస్తే… ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారు అమలు చేస్తున్న ఈ పథకం పట్ల మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది నిర్వాకం వల్ల ఈ పథకం లబ్ధిదారులకు సరిగ్గా అందడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో గురువారం విజయవాడ నుంచి పెనమలూరు వెళుతున్న క్రమంలో ప్రయాణికులు బస్టాప్ వద్ద బస్ కోసం వేచి చూస్తున్నా… ఓ ఆర్టీసీ బస్సు సదరు స్టాప్ లో ఆగకుండా అలా స్పీడుగా వెళ్లిపోయింది. దీనిని గమనించిన బోడె ప్రసాద్ వెంటనే ఆ బస్సును వెంబడించారు.
తన వాహనాన్ని స్పీడుగాముందుకు ఉరికించిన బోడె…చివరకు ఆ బస్సును అధిగమించి దానిని ఆపారు. ఆ తర్వాత బస్సులోకి ఎక్కిన బోడె… ప్రయాణికులు ఉన్నా బస్టాప్ లో నిలబెట్టకుండా ఎందుకు వెళుతున్నారంటూ ఆయన బస్సు డ్రైవర్, కండక్టర్ లను నిలదీశారు.
రోడ్డుపై ఎక్కడ ప్రయాణికులు చేయెత్తినా బస్సును ఆపి వారిని ఎక్కించుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని బోడె ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు. ఈ తరహాలో కొందరు ఆర్టీసీ సిబ్బంది నిర్దేశిత బస్సు స్టాప్ లలో బస్సులను ఆపకుండా వెళుతున్నారని… ఫలితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అభాసుపాలు అవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై ఈ తరహా ఉల్లంఘనలను సహించేది లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉరిత బస్సు ప్రయాణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…