వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేస్తూ మెగా 158 సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలనేది దర్శకుడు బాబీ లక్ష్యం. అయితే అది నెరవేరే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానే లేదు. మార్చి అన్నారు తర్వాత ఏప్రిల్ అన్నారు. ఇప్పుడు మే వచ్చేసింది. రేపో ఎల్లుండో స్టార్ట్ అవ్వొచ్చు. ఇటీవలే ఫోటో షూట్ చేసి చిరంజీవి స్టిల్స్ అన్నీ ఓకే చేసుకున్నారు. ఇక్కడో సమస్య ఉంది.
మే మినహాయిస్తే కేవలం ఏడు నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం అంత సులభం కాదు. పైగా కోల్కతా బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ కు జన నాయకుడు రిలీజ్ సమస్య ఇంకా తీరనే లేదు. ఈ నెలాఖరుకు అయిపోవచ్చని అంటున్నారు. టాక్సిక్ వ్యవహారం ఇంచుమించు అలాగే ఉంది. జూన్ 4 వదిలేసుకున్నాక మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు.ఇటీవలే రిలీజైన కెడి డెవిల్ ఫ్లాప్ అయ్యింది.
సో మెగా 158 వచ్చే సంవత్సరం వేసవికి వెళ్లడం మినహా వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అప్పుడు కూడా చూసి అడుగులు వేయాలి. ఎందుకంటే జూన్ లో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వరసగా స్పిరిట్, వారణాసి వస్తాయి. ఇన్ని ప్యాన్ ఇండియా మూవీస్ మధ్య మెగా 158కి సరైన స్లాట్ పట్టుకోవడం సవాల్ లాంటిది. ముందైతే సెట్స్ లో అడుగు పెడితే తర్వాత లెక్కలు వేసుకొచ్చు కానీ కొబ్బరికాయ కొట్టడమే అసలు సమస్య.
ఇదిలా ఉంచితే చిరంజీవి అభిమానులు విశ్వంభర కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికి వస్తుందో ఎవరికి తెలియదు. యువి క్రియేషన్స్ నుంచి అప్డేట్ లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే దసరా లేదా దీపావళి అని ఉంది. అదంత ఈజీ కాదు. ఎందుకంటే దివాలి పండక్కు రామాయణ పార్ట్ 1 ఉంది కాబట్టి దాని కన్నా ముందే వస్తే బాగుంటుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మెగా 158 చిరు భార్యగా ప్రియమణి నటించనుంది. ఇందులో డ్యూయెట్లు గట్రా ఉండవు.
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…