వైసీపీ నేతలకు మరో చిక్కు ఎదురు కానుందా? మరో కీలక పరిణామాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీలను(తయారీ కంపెనీలు) బెదిరించి కమీషన్లు తినేసిన కేసు ప్రస్తుతం మూడు రూపాలు సంతరించుకుంది. 1) ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్రమంలో 38 మందిపై కేసు నమోదైంది. పలువురు జైలు పాలై.. ఇటీవల కొందరు షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చారు.
2) ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్: ఈ అక్రమ మద్యం లావాదేవీలకు సంబంధించిన సొమ్మును విదేశాలకు తరలించారన్న వాదన ఉంది. ఈ క్రమంలో మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఆరోపణలపై ఈడీ అధి కారులు సోధిస్తున్నారు. దీనిపై ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి సంబంధించిన 300 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. అలానే.. మరికొందరిపైనా విచారణ కొనసాగుతోంది. ఇంతలో ఈ ఆదాయాలకు సంబంధించిన పన్ను ఎగవేతల అంశం కూడా తెరమీదికి వచ్చింది.
3) ఐటీ ఎంట్రీ: ఇప్పుడు తాజాగా నాటి కేసులో ఇన్ కం ట్యాక్స్ అధికారులు కూడా రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈడీ అధికారుల నుంచి వారు సమాచారం సేకరించారు. ఆనాటి డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలు.. ఇలా అన్ని అంశాలను వారు పరిశీలిస్తున్నారు. సదరు నగదుకు సంబం ధించి పన్ను ఎగవేతలు జరిగినట్టు గుర్తించే పనిలో ఉన్నారు. ఒకవైపు నగదు అక్రమాలపై రాష్ట్ర పోలీసులు.. నగదు లాండరింగ్(విదేశాలకు పంపేయడం)పై ఈడీ, ఇప్పుడు ట్యాక్స్ ఎగవేతలపై ఐటీ అధికారులు ముసురుకున్నారు. దీంతో వైసీపీకి ముప్పేట చుక్కలు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…
లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో…
జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా…
కోలీవుడ్ లోనే కాదు మన టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ లోనూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి.…