Political News

వైసీపీకి ముప్పేట‌ చిక్కు.. రంగంలోకి ఐటీ ఎంట్రీ!

వైసీపీ నేత‌ల‌కు మ‌రో చిక్కు ఎదురు కానుందా? మ‌రో కీల‌క ప‌రిణామాన్ని ఫేస్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో మ‌ద్యం డిస్టిల‌రీల‌ను(త‌యారీ కంపెనీలు) బెదిరించి క‌మీష‌న్లు తినేసిన కేసు ప్ర‌స్తుతం మూడు రూపాలు సంత‌రించుకుంది. 1) ఈ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్ర‌మంలో 38 మందిపై కేసు న‌మోదైంది. ప‌లువురు జైలు పాలై.. ఇటీవ‌ల కొంద‌రు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

2) ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌: ఈ అక్ర‌మ మ‌ద్యం లావాదేవీల‌కు సంబంధించిన సొమ్మును విదేశాల‌కు త‌ర‌లించార‌న్న వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో మ‌నీలాండ‌రింగ్ కూడా జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ అధి కారులు సోధిస్తున్నారు. దీనిపై ఏ1గా ఉన్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి సంబంధించిన 300 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను సీజ్ చేశారు. అలానే.. మ‌రికొంద‌రిపైనా విచార‌ణ కొన‌సాగుతోంది. ఇంత‌లో ఈ ఆదాయాల‌కు సంబంధించిన ప‌న్ను ఎగ‌వేత‌ల అంశం కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

3) ఐటీ ఎంట్రీ: ఇప్పుడు తాజాగా నాటి కేసులో ఇన్ కం ట్యాక్స్ అధికారులు కూడా రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈడీ అధికారుల నుంచి వారు స‌మాచారం సేక‌రించారు. ఆనాటి డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలు, న‌గ‌దు లావాదేవీలు.. ఇలా అన్ని అంశాల‌ను వారు ప‌రిశీలిస్తున్నారు. స‌ద‌రు న‌గ‌దుకు సంబం ధించి ప‌న్ను ఎగ‌వేత‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించే ప‌నిలో ఉన్నారు. ఒక‌వైపు న‌గ‌దు అక్ర‌మాల‌పై రాష్ట్ర పోలీసులు.. న‌గ‌దు లాండ‌రింగ్‌(విదేశాల‌కు పంపేయ‌డం)పై ఈడీ, ఇప్పుడు ట్యాక్స్ ఎగ‌వేత‌ల‌పై ఐటీ అధికారులు ముసురుకున్నారు. దీంతో వైసీపీకి ముప్పేట చుక్క‌లు క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on May 3, 2026 9:04 am

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

36 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

2 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

7 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

10 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

10 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago