బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు కొట్టారు. తన సొంత భాష మలయాళంలో మోహన్ లాల్ లాగే బాలీవుడ్లోనూ ప్రియదర్శన్కు ఒక ఫేవరెట్ హీరో ఉన్నారు. అతనే.. అక్షయ్ కుమార్. వీరి కలయికలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కిన ‘భూత్ బంగ్లా’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.
ఈ చిత్రానికి అంత మంచి టాక్, రివ్యూలేమీ రాలేదు. కానీ ఇందులో వినోదం నచ్చి ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ఇప్పటికే ‘భూత్ బంగ్లా’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్న టీంకు.. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం ఇబ్బందికరంగా మారింది.
ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఓ ముఖ్య పాత్రలో నటించగా.. ఆమె పాత్ర నిడివి, ప్రాధాన్యం తక్కువగా ఉందని.. కావాలనే ఆమె మీద తీసిన కొన్ని సీన్లను ఎడిటింగ్లో లేపేశారని.. ఇదంతా అక్షయ్ కుమారే పనిగట్టుకుని చేశారని ఒక ప్రచారం నడుస్తోంది.
తనను టబు సినిమాలో డామినేట్ చేసేలా ఉందనే అక్షయ్.. తన మిత్రుడైన ప్రియదర్శన్తో కలిసి ఆమె సీన్లను కత్తిరించాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రియదర్శన్ స్పందించాడు. ఈ ప్రచారాన్ని ఖండించాడు.
‘‘మా సినిమా విజయాన్ని తట్టుకోలేక కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. టబు ‘భూత్ బంగ్లా’ విషయంలో ఎంతమాత్రం అసంతృప్తితో లేరు. నేను ఆమెతో ఎనిమిది సినిమాలు చేశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టబుకు ఏదైనా సమస్య ఉంటే నాతో నేరుగా మాట్లాడుతుంది.
ఆమె మీద షూట్ చేసిన ప్రతి సన్నివేశాన్నీ సినిమాలో పెట్టాం. ఏదీ కట్ చేయలేదు. నిజానికి సినిమాలో ఏదైనా తీసేయాలంటే అది నిర్ణయించేది దర్శకుడినైన నేను. అక్షయ్ ఎప్పుడూ ఎడిటింగ్లో జోక్యం చేసుకోడు. సినిమా విడుదలకు ముందు మెయిన్ ఆర్టిస్టులందరూ ప్రివ్యూ చూశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వాళ్లు సిగ్గుపడాలి’’ అని ప్రియదర్శన్ ఫైర్ అయ్యారు.
This post was last modified on May 2, 2026 8:15 pm
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం…
ఈ రోజుల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లకు వచ్చే జనం…
ఇండియన్ క్రికెట్లోనే ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్…
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను తప్పు చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం…
మోస్ట్ వాంటెడ్ ఫ్రాంచైజ్ లో ఒకటైన దృశ్యం మూడో భాగం ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. ఊహించని విధంగా తెలుగులో కూడా…