Political News

ప‌వ‌న్‌కు బాబు ప‌రామ‌ర్శ‌.. పిఠాపురంపై చ‌ర్చ‌?!

జ‌న‌సేన అధినేత‌,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు పరామ‌ర్శించారు. కొన్నాళ్ల కింద‌ట ముక్కుకు ఆప‌రేషన్ అయిన నేప‌థ్యంలో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న నివాసంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా శ‌నివారం హైద‌రాబాద్ వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఆయ‌న నివాసానికి వెళ్లి.. ఆరోగ్యంపై వివ‌రాలు తెలుసుకున్నారు. గ‌త వారం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష చేస్తున్న క్ర‌మంలో ఆరోగ్య స‌మ‌స్య ఎదురైంది. దీంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స చేశారు.

ప‌రామ‌ర్శ అనంత‌రం.. ప‌వ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌పైనా ఇరువురు మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవ‌ల ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ-జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కులు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగారు.

ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుని వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చంద్ర‌బాబు చ‌ర్చించి.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలో తాజాగా ప‌వ‌న్‌తో ఈ విష‌యం చ‌ర్చించిన చంద్ర‌బాబు.. పిఠాపురంలో ఎలాంటి రాజ‌కీయాల‌కు తావు లేద‌ని, అభివృద్ధి విష‌యంలో ఎలాంటి అడ్డంకులు రాబోవ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. పిఠాపురంలో గ‌తానికి భిన్నంగా రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, చేప‌ట్టిన ప్రాజెక్టులు.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల సీఎం సంతోషం వ్య‌క్తం చేశారు.

త‌న‌వంతుగా.. నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలకు అవ‌కాశం లేకుండా చూస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం కావాల్సింది అభివృద్ధేన‌ని.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా క‌ల‌సి ఉండ‌డ‌మే ముఖ్య‌మని ఇరువురు నాయ‌కులు ఒక అభిప్రాయానికి వ‌చ్చారు.

This post was last modified on May 2, 2026 8:12 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago