జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది. భీభత్సమైన హౌస్ ఫుల్స్ తో కలెక్షన్లు రాలేదు కానీ ఉన్నంతలో మెయిన్ సెంటర్లలో యాభై శాతం అంతకన్నా ఎక్కువ ఆక్యుపెన్సీలు కనిపించాయంటే దానికి కారణం సత్య మీద జనాలకున్న నమ్మకమే. ఆశ్చర్యంగా కొన్ని కేంద్రాల్లో గాయపడ్డ సింహం కన్నా జెట్లీ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. బుక్ మై షోలోనూ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉంది.
ఇకపై కేవలం హీరోగా కొనసాగడం సత్యకు సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే కొంత కాలం సోలో హీరోగా మార్కెట్ ఎంజాయ్ చేద్దామనుకుంటే సరైన హిట్టు ఒకటి పడాలి. జెట్లీలో ఉన్న లోపాలు ఆ కోరికను పూర్తిగా నెరవేర్చేలా లేవు. ఒక వర్గం ఆడియన్స్ ని కొంత మేర మెప్పించినా అందరినీ కన్విన్స్ చేయడంలో దర్శకుడు రితేష్ రానా సక్సెస్ కాలేదు. కీలకమైన వీకెండ్ ముందున్న నేపథ్యంలో టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని పంచుకుంది. ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి.
రాబోయే రోజుల్లో కేవలం తన మీద నడిచే కథలను ఎంచుకునే విషయంలో సత్య జాగ్రత్త వహించక తప్పదు. రంగబలి ఫేమ్ పవన్ దర్శకత్వంలో ఇటీవలే ఒక సినిమాకు సైన్ చేశాడు. అందులో కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రధారి. తర్వాత ఇంపార్టెన్స్ సత్యకు ఉంటుంది. ఎలాగూ తమిళ డబ్బింగ్ అవుతుంది కాబట్టి కంటెంట్ కనక జనాలకు నచ్చితే ఇతర భాషల్లోనూ పాపులారిటీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి జెట్లీ చాలా నెమ్మదిగా మొదలయ్యింది కనక సోమవారానికి ఏ పొజిషన్ లో ఉంటుందనేది క్లారిటీ వస్తుంది. ఒకవేళ యునానిమస్ అనిపించుకుంటే సీన్ వేరుగా ఉండేది. సెన్సేషనల్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయేది. ఇదే సత్యతో జెట్లీ లాంటి విమానం కథ కాకుండా బయట సిటీలో నడిచే ఎంటర్ టైనర్ తీసి ఉంటే బాగుండేదనే కామెంట్లో నిజం లేకపోలేదు. అన్నట్టు జెట్లీ సీక్వెల్ 2030 అని చివర్లో చెప్పారు. అది ఉంటుందో లేదో అని సత్యతోనే డైలాగు చెప్పించడం కొసమెరుపు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…