Political News

బీజేపీలో పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి కోడలు

టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి…ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ మారబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం కోసం ఈ దఫా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి పార్టీ మారడం లేదని స్వయంగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి శుక్రవారం తేల్చిపారేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ కార్యలయానికి వెళ్లిన ప్రీతి రెడ్డి.. అక్కడ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తామేమీ పార్టీ మారబోవడం లేదని ప్రీతిరెడ్డి వెల్లడించారు. ఓ కీలకమైన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రప్పించే దిశగా తమ కుటుంబం యత్నిస్తోందని, అందులో భాగంగానే తాము అటు మోదీతో పాటుగా ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రముఖులను కలుస్తున్నామని ఆమె వివరించారు. తన మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటారని ఆమె చెప్పారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని కూడా ఆమె వెల్లడించారు.

మల్లారెడ్డి ఫ్యామిలీ త్వరలోనే సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్పంచుకునేలా మల్లారెడ్డి ఫ్యామిలీ యత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిశారు. తాజాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు.

తాను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో టచ్ లో ఉన్నానని చెప్పిన ప్రీతి రెడ్డి…ఇటీవలే బీజేపీ తెలంగాణ చీప్ రాంచందర్ రావునూ కలిశారు. ఇలా వరుసబెట్టి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ నేతలను కలుస్తుండటంతో ఆ ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగాయి. అయితే ప్రీతిరెడ్డి తాజాగా వాటికి చెక్ పెట్టారు.

This post was last modified on April 24, 2026 3:29 pm

Share

Recent Posts

బ్రేకింగ్: అర్ధరాత్రి మోదీ సెల్ఫీ వీడియో

Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…

1 hour ago

మ‌హేష్ అంత డేరింగ్ స్టెప్ వేశాడా?

అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే ద‌ర్శ‌కుల‌తో.. కొత్త‌వాళ్లు, పెద్ద‌గా అనుభ‌వం లేని డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయ‌డం…

4 hours ago

ఓటు లేక‌పోతే… ప‌థ‌కాలు క‌ట్: రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!!

రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎలా అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎవ‌రి…

5 hours ago

చెన్నై లవ్ స్టోరీకి లైన్ క్లియర్

సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…

5 hours ago

బాలయ్యని మ్యాచ్ చేయడం ఈజీ కాదు

ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…

5 hours ago

బండ్ల గణేష్‌కు అక్కడా షాకే

ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన…

5 hours ago