Political News

బీజేపీలో పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి కోడలు

టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి…ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ మారబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం కోసం ఈ దఫా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి పార్టీ మారడం లేదని స్వయంగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి శుక్రవారం తేల్చిపారేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ కార్యలయానికి వెళ్లిన ప్రీతి రెడ్డి.. అక్కడ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తామేమీ పార్టీ మారబోవడం లేదని ప్రీతిరెడ్డి వెల్లడించారు. ఓ కీలకమైన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రప్పించే దిశగా తమ కుటుంబం యత్నిస్తోందని, అందులో భాగంగానే తాము అటు మోదీతో పాటుగా ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రముఖులను కలుస్తున్నామని ఆమె వివరించారు. తన మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటారని ఆమె చెప్పారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని కూడా ఆమె వెల్లడించారు.

మల్లారెడ్డి ఫ్యామిలీ త్వరలోనే సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్పంచుకునేలా మల్లారెడ్డి ఫ్యామిలీ యత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిశారు. తాజాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు.

తాను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో టచ్ లో ఉన్నానని చెప్పిన ప్రీతి రెడ్డి…ఇటీవలే బీజేపీ తెలంగాణ చీప్ రాంచందర్ రావునూ కలిశారు. ఇలా వరుసబెట్టి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ నేతలను కలుస్తుండటంతో ఆ ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగాయి. అయితే ప్రీతిరెడ్డి తాజాగా వాటికి చెక్ పెట్టారు.

Kumar

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

43 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

53 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

3 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

3 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago