గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మలి దశ ఓ రేంజిలో ఉంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. సోమవారం తన సొంతూరు జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జీవన్ రెడ్డి చేరిక కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక మీద నుంచే కేసీఆర ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గురించి, జీవన్ రెడ్డికి పార్టీ అప్పగించే బాధ్యతల గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి వచ్చిన జీవన్ రెడ్డిని ఆయన సొంత జిల్లా జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే పరిమితం చేయబోమని కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకుంటామని కూడా కేసీఆర్ ప్రకటించారు.
పార్టీలో జీవన్ రెడ్డికి ప్రాధాన్యతతోనే సరిపెట్టని కేసీఆర్.. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే… బీఆర్ఎస్ కేబినెట్ లో జీవన్ రెడ్డికి కీలక పదవులు అప్పగిస్తామని ప్రకటించారు. కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేయబోతున్నారని ఆయన చెప్పినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది.
జీవన్ రెడ్డి అనుభవాన్ని అటు పార్టీతో పాటుగా ప్రభుత్వ పరంగానూ వినియోగించుకోవడానికి తమ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి రూపంలో జగిత్యాల జిల్లా ప్రజలు ఓ మంచి నేత నుంచి మంచి పాలనను చూస్తారని కేసీఆర్ అన్నారు. మొత్తంగా జీవన్ రెడ్డికి పార్టీలో ఎనలేని ప్రాధాన్యం దక్కిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on April 20, 2026 10:15 pm
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…