Political News

రేప్ చేసి.. కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు

మరో దారుణం వెలుగు చూసింది. పాతికేళ్ల యువతిని దారుణంగా రేప్ చేసి.. కదులుతున్న రైల్లో నుంచి తోసేసిన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. మహారాష్ట్రంలోని నవీ ముంబయిలో చోటు చేసుకున్న ఈ ఆరాచక ఘటన సంచలనంగా మారింది. వశీ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

టిట్వాలాకు చెందిన పాతికేళ్ల యువతి.. పొవైలో ఇంటిపనులు చేస్తుంటుంది. తల్లిదండ్రుల్ని చూసేందుకు వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి వస్తుండటం అలవాటు. ఎప్పటిలానే గతశనివారం ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం సాయంత్రం తిరిగి పొవైకి బయలుదేరింది. అయితే.. అప్పటి నుంచి ఇంట్లోని వారికి అందుబాటులో లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమెను అపస్మారక స్థితిలో వశీ రైల్వే బ్రిడ్జి పైన పడి ఉంది. దీన్ని గుర్తించిన వారు.. స్థానిక రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

దీంతో.. ఆ యువతిని జేజే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉన్నా.. మాట్లాడలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆమె నోరు విప్పితేనే.. అసలేం జరిగిందన్న విషయంపై అవగాహన వస్తుందని చెబుతున్నారు. వైద్య నివేదికల ప్రకారం ఆమెపై అత్యారచారం జరిగినట్లుగా చెబుతున్నారు. అనంతరం కదులుతున్న రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమె నోరు విప్పితే.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీసే వీలుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on December 27, 2020 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

4 minutes ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

13 minutes ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

26 minutes ago

కొడాలి రీప్లేస్.. ఖాయమంటున్న కేడర్..!

కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…

47 minutes ago

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

1 hour ago

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

2 hours ago