Political News

నాకు కోర్టు అనుమతి అవసరం లేదు: లోకేష్

డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలు నిరూపించాలని జగన్ కు విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. ఆ ఆరోపణలపై ఆధారాలతో చర్చకు రావాలని జగన్ కు లోకేశ్ మూడు సార్లు సవాల్ చేసినా జగన్ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో మరోసారి జగన్ కు లోకేశ్ సవాల్ విసిరారు.

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ ను నాలుగోసారి ఛాలెంజ్ చేస్తున్నానని, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని లోకేశ్ నిండు సభలో సవాల్ విసిరారు. జగన్ అనే వ్యక్తి తనను, సీఎం చంద్రబాబును కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారని లోకేశ్ అన్నారు. ఏ అంశంపై అయినా చర్చకు తాము సిద్ధమని లోకేశ్ చెప్పారు. ప్రెస్ మీట్ లు పెట్టడం కాదని, సభలోపల..సభ వెలుపల చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
11 మంది పట్టే బ్లాక్ కూడా ఉందని, చర్చకు రావాలని జగన్ ను డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే జగన్ పై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షా..ఈ రోజు ప్రతిపక్ష పార్టీ…అనబోయిన లోకేశ్…క్షమించాలి అంటూ వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదన్న విషయాన్ని సెటైరికల్ గా చెప్పారు. ఇక, తాను గొడ్డలి పార్టీ అధ్యక్షుడిలాగా పారిపోవడం లేదని, తాను ఎక్కడికైనా వెళ్లాలంటే తనకు కోర్టు అనుమతి అవసరం లేదని లోకేశ్ అన్నారు. తనపై సీబీఐ కేసులు లేవని గుర్తు చేశారు. 2029 ఎన్నికలకు ముందు మరో 3 డీఎస్సీలు వేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని లోకేశ్ చెప్పారు.

This post was last modified on August 17, 2026 7:59 pm

Share

Recent Posts

కూలిపోయిన హాస్టల్… అగ్రిమెంట్‌లో మాత్రం ‘మాకు బాధ్యత లేదు’!

ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…

2 hours ago

అప్పుడు బన్నీతో… ఇప్పుడు బాలయ్యతో?

తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…

3 hours ago

ది ప్యారడైజ్.. నాన్ స్టాప్ మోడ్

చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…

3 hours ago

ఫేక్ కలెక్షన్లపై వంగ బ్రదర్ పంచ్‌లు

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు. ఈ రోజుల్లో ఒరిజినల్ కలెక్షన్లను పెంచి పోస్టర్లు వేయడం మామూలైపోయింది.…

4 hours ago

అయోమయంలో ఇస్రో అధికారులు?

దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తు ప్రమాదంలో పడిందా అంటే అవుననే చెప్పాలి. అత్యంత…

4 hours ago

కమ్మ, రెడ్లే సీఎంలు కావాలా?: సాయిరెడ్డి

రాజకీయాలకు గుడ్ బై చెప్పానని…వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన రాజ్య సభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి త్వరలోని కొత్త పార్టీ పెట్టబోతున్న…

4 hours ago