గత కొన్ని రోజులుగా మలయాళ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి ఆమె సంచలన విషయాలు వెల్లడించింది. తన ఎక్స్ లవర్ వల్ల మానసిక క్షోభ అనుభవించినట్లు ఆమె చెబుతోంది. అతణ్ని అపరిచితుడు క్యారెక్టర్తో పోల్చింది. తన వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొన్నానని.. ట్రామా అనుభవించానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడా అనుపమ ఆ వ్యక్తి పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె బైసన్ సినిమాలో నటిస్తున్న సమయంలో ధ్రువ్ విక్రమ్తో ప్రేమలో పడి, రెండేళ్ల పాటు తనతో రిలేషన్షిప్లో ఉందన్న అనుమానం అందరికీ ఉంది. ఈ నేపథ్యంలో ధ్రువ్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎటాక్ జరుగుతోంది.
దీంతో అనుపమ వ్యాఖ్యలు, ఆరోపణలపై ధ్రువ్ స్పందన కోసం.. తన వెర్షన్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలో అతను పాల్గొనగా.. అక్కడ అతను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం గురించి నర్మగర్భంగా మాట్లాడాడు. యాంకర్ కూడా సూటిగా వివాదం గురించి ప్రస్తావించకుండా, సోషల్ మీడియాలో నిరంతరం జరిగే స్క్రుటినీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని ధ్రువ్ను అడిగింది.
దీనిపై అతను స్పందిస్తూ.. ”ఈ పని నుంచి నేను త్వరగా నిష్క్రమించినపుడే స్క్రుటినీ ఉంటుందని అంచనా వేశా. ఇది నన్ను ప్రభావితం చేయలేదని చెప్పను. మనం ప్రేమించేవాళ్లందరినీ కొంచెం బలంగా రక్షించే ప్రయత్నం చేయాల్సిన అవసరముంటుంది. మనం నిజానికి కట్టుబడినపుడు, మనల్ని నడిపించేది ఏంటో మనకు తెలిసినపుడు, ఈ స్క్రుటినీ అన్నది నెమ్మదిగా పక్కకు వెళ్లిపోతుంది. నా ప్రయాణంలో ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు” అంటూ నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు ధ్రువ్.
ఐతే వ్యక్తిగత విషయాల గురించి లోతుగా మాట్లాడే వేదిక కాదు కాబట్టి ధ్రువ్ ఇలా మాట్లాడి ఉండొచ్చు కానీ, భవిష్యత్తులో మీడియాకు పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు మాత్రం తనపై వచ్చిన ఆరోపణలపై ధ్రువ్ సూటిగా స్పందించే అవకాశముంది.
This post was last modified on August 17, 2026 8:03 pm
చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(సర్) తెలంగాణలో ముగిసింది. దాదాపు 2 మాసాలకు పైగానే ఈ…
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్రష్ఠి వర్మ.. రాజకీయాల్లోకి…
ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…
నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…
విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…