యువ నటుడు నవీన్ పొలిశెట్టి కెరీర్ను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు ముందు, తర్వాత అని విభజించి చెప్పొచ్చు. ఆ సినిమా ముందు వరకు అతడి టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే లాంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసిన అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
ఐతే యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, స్పెషల్ వీడియాలతో అతను ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే చిచ్చోరేలో ఓ కీలక పాత్రతో మెప్పించాడు. రచ్చ గెలిచాక ఇంటికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు ప్రేక్షకులకు తన టాలెంట్ ఏంటో చూపించాడు. దీని తర్వాత నవీన్ నుంచి రాబోయే కొత్త సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో నవీన్ తన తర్వాతి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే.. జాతి రత్నాలు. ఇందులో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ముగ్గురే ఇందులో జాతిరత్నాలు. అందులో ఒకరి పరిచయం శనివారం జరిగింది. ఈ రోజు నవీన్ పుట్టిన రోజు సందర్భంగా అతను పోషిస్తున్న జోగిపేట శ్రీకాంత్ పాత్రను పరిచయం చేశారు. ఆ పాత్ర టీజర్లో నవీన్ ఖైదీగా కనిపించడం విశేషం.
సెల్ నుంచిపోలీసుల అరాచకాలను ఖండిస్తూ తనదైన టైమింగ్తో అతను చెప్పిన డైలాగ్.. జైల్లో పని చేస్తూ అతను పడే పాట్లు ఫన్నీగా అనిపించాయి. మంచి కామెడీ ఎంటర్టైనర్ చూడబోతున్నామన్న అంచనాలను ఈ టీజర్ కలిగించింది. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు టీజర్లోనే ప్రకటించారు. అనుదీప్ కె.వి. ఈ చిత్రానికి దర్శకుడు.
This post was last modified on December 27, 2020 10:21 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…