జాతీయ స్తాయిలో ఇప్పుడు రెండు కీలక అంశాలపై ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ బిల్లుల విషయంలో అధికార ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి తమదైన చర్చలను సాగిస్తున్నాయి. ఇక ఈ రెండు కూటములలో లేని తెలంగాణ విపక్ష పార్టీ బీఆర్ఎస్ తన వైఖరిపై తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన నారీ శక్తి వందనం బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్… నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… దక్షిణాదికి న్యాయం జరిగితేనే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
అయినా ఇప్పుడు బీఆర్ఎస్ కు లోక్ సభలో సింగిల్ సీటు కూడా లేదు. ఇక రాజ్యసభలో నాలుగు స్థానాలు బీఆర్ఎస్ కు ఉన్నాయి. అంటే..లోక్ సభలో బిల్లులను ప్రవేశఫెట్టినప్పుడు బీఆర్ఎస్ కు కనీసం స్పందించేందుకూ అవకాశం లేదన్న మాట.
ఇక లోక్ సభ ఆమోదం తర్వాత రాజ్యసభకు వచ్చే ఆ బిల్లులను బీఆర్ఎస్ అడ్డుకోవాలనుకున్నా… కుదిరే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే… ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్నది నలుగురు సభ్యులే.
ఈ బిల్లులకు సంబంధించి అడ్డుకునే, ముందుకు సాగించే పరిస్థితి ఎంతమాత్రం లేకున్నా,… ఓ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఈ బిల్లులపై స్పందించాలి కదా. అందులో భాగంగానే పార్టీ అధినేత హోదాలో కేసీఆర్… బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నేత హరీశ్ రావులతో భేటీ అయ్యారు. బిల్లులపై చర్చించారు. ఈ సందర్భంగా మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపేలా రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేయాలని ఆయన వారిద్దరికీ సూచించారు.
ఇక డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం మేర సీట్లున్నాయి. ఇప్పుడు డీలిమిటేసన్ తర్వాత కూడా అంతే స్థాయిలో సీట్లు… అంటే డీలిమిటేషన్ జరిగిన తర్వాత కూడా మొత్తం సీట్లలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం సీట్లు ఉండేలా చూడాలన్నది కేసీఆర్ భావనగా తెలుస్తోంది. అలా కాని పక్షంలో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పిన కేసీఆర్…రాజ్యసభలో ఆ బిల్లును వ్యతిరేకించాలని, ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…