Political News

హీటెక్కిన తాడిప‌త్రి రాజకీయం

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. నిరంత‌రం రాజ‌కీయ సంఘ‌ర్ష‌ణ‌లకు ఈ నియోజ‌క‌వ‌ర్గం వేదిక‌గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. అది రాజ‌కీయ వేడిని రాజేస్తోంది. ముఖ్యంగా వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య అగ్గిమీద గుగ్గిలంలాగా ఇక్క‌డ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది.

ఈ క్ర‌మంలో గ‌త కొన్నాళ్లుగా రాజ‌కీయ అల‌జ‌డి నెల‌కొన్న తాడిప‌త్రిలో.. ఇటీవ‌ల 15 రోజులుగా మాత్ర‌మే ఒకింత ప్ర‌శాంతంగా ఉంది. పోనీలే.. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా మ‌రో భారీ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జేసీ కుటుంబానికి చెందిన చింత చెట్లకు దుండ‌గులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 30 ఎక‌రాల్లోని చింత‌చెట్లు త‌గ‌ల‌బడి బూడిద‌య్యాయి.

ఈ ప‌రిణామంతో మ‌రోసారి రాజ‌కీయ క‌ల‌కలం రేగింది. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జూటూరులో జేసీ 60 ఎకరాల్లో చింత మొక్కలను పెంచుతున్నారు. అయితే.. గుర్తుతెలియని దుండగులు చింత‌ తోటకు నిప్పు పెట్టడంతో చెట్లన్నీ బూడిద‌య్యాయి. ఈ ప‌రిణామం వెనుక వైసీపీ నాయ‌కుల హ‌స్తం ఉంద‌ని జేసీ వ‌ర్గం ఆరోపించింది. త‌మ‌ను వేధించేందుకే ఇలా చేస్తున్నార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మ‌రోవైపు.. జేసీ ఉద్దేశ పూర్వ‌కంగానేఇలా చేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. చింత చేను ఎండిపోయింద‌ని.. దీంతో ఎలానూ న‌ష్టం వ‌చ్చింది కాబ‌ట్టి.. దానికి నిప్పు పెట్టుకున్నార‌ని.. పైగా దీనిని రాజకీయంగా వాడుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు.

ఇరు వ‌ర్గాల మ‌ధ్య మ‌రోసారి మాటల యుద్ధం ప్రారంభ‌మైంది. దీంతో తాడిప‌త్రిలో యాక్ట్ 30తో పాటు కీల‌క ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ విధించేందుకు పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎటుదారితీస్తుందో చూడాలి.

This post was last modified on April 15, 2026 12:09 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

29 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago