వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ప్లాన్ బీ ప్రకారం మావిగన్ (మచిలీపట్నం + విజయవాడ + గుంటూరు) అంటున్న నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గానికి కూడా పేరు పెడతారా? అని ప్రశ్నించారు. దీనికి అవి గొడ్డలి అని పేరు పెడితే అందరూ సంతోషిస్తారని వ్యాఖ్యానించారు.
పులివెందులకు కూడా పేరు పెడతారా? అవినాష్ గొడ్డలి.. అవి గొడ్డలి అని మారుస్తారా? అని ప్రశ్నించారు.
ఇద్దరి పేర్లూ.. సరిపోతాయి!
జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై ఈ సందర్భంగా షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పేరులో గన్ ఉందని, అవినాష్ పేరులో వినాశనం ఉందని, ఇద్దరి పేర్లూ సరిపోతాయని వ్యాఖ్యానించారు.
‘ఎంతసేపూ నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలి’ ఇదే వైసీపీ సిద్ధాంతమని అన్నారు. ఎంతసేపూ గన్లు గొడ్డళ్లేనా? అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో రాజధాని అమరావతికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు.
అమరావతికి బదులు మావిగన్ పేరు బాగుందంటున్న వైసీపీ అధినేత జగన్.. పులివెందులకు బదులు అవి గొడ్డలి పేరు పెడతారా? అని షర్మిల వ్యాఖ్యానించారు. మావిగన్ బాగుందని చెబుతున్న జగన్ ఐదేళ్లు ఏం చేశారో ప్రశ్నించారు. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎందుకు తెరమీదికి తెచ్చారని అన్నారు. ఈ విషయంలో నవ్వు తప్ప తమకు ఏమీ రావడం లేదని ఎద్దేవా చేశారు.
బొత్స ఏడ్చింది తక్కువే!
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జరిగిన పరిణామాలపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై షర్మిల స్పందిస్తూ, విజయమ్మకు జరిగిన అవమానం ముందు ఈ కన్నీరు తక్కువేనన్నారు.
నిండు సభలో విజయమ్మను అవమానించిన బొత్స ఎంత ఏడ్చినా తక్కువే అని వ్యాఖ్యానించారు.
వైఎస్ పేరు నాకే సొంతం!
వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును వాడుకునే హక్కు, ఆయన వారసురాలిగా రాజకీయాలు చేసే హక్కు కూడా తనకే ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. తాను కూటమికి అమ్ముడు పోయానని చెబుతున్న వైసీపీ నాయకులు బీజేపీకి జగన్ ఎందుకు అమ్ముడు పోయాడో చెప్పాలని ప్రశ్నించారు. మోడీతో అక్రమంగా పొత్తు ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాలన్నారు.
తన జీవితాంతం బీజేపీని వ్యతిరేకించి వైఎస్ పేరును తలుచుకునే హక్కు, ఆయన పేరును వాడుకునే హక్కు కూడా వైసీపీకి లేదన్నారు.
This post was last modified on April 10, 2026 11:39 pm
పైరసీ గురించి మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సెన్సార్ వివాదం, తమిళనాడు ఎన్నికల వల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన…
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం…
ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టేసింది. ఉదయం…
రాజకీయాల్లో సూపర్ పాపులర్ అయిన ముగ్గురు టీడీపీ ముఖ్యనేతలు ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సాయం చేయబోయి అధిష్టానంకు అడ్డంగా…
హఠాత్తుగా కోలీవుడ్ వర్గాల్లో ఒక పుకారు మొదలైపోయింది. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ క్యామియో చేయడం లేదని దాదాపు ఖరారు…
వైఎస్ రాజశేఖరెడ్డి వారసులమంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పిల్లలు చేస్తున్న కీచులాట.. ఆ కుటుంబాన్ని అభిమానించే వేలాది మందిని బాధిస్తున్నాయి.…