రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు కుదరని పని. ఆ క్రమంలోనే చాలామంది నేతలు బీపీ, షుగర్ ఎట్సెట్రాలతో ఇబ్బందిపడుతుంటారు. తాను కూడా ఆ కోవలోకే వస్తానని వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు.
రాజకీయాలపై రోజా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీపీ, షుగర్ వచ్చాయని రోజా అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయిందని, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయిందని చెప్పారు.
అయితే, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త ఒత్తిడి తగ్గి కాంపెన్సేట్ అయిందని సెటైర్ వేశారు. రాజకీయాలంటేనే ఎన్నో టెన్షన్స్ ఉంటాయని, ఎంతోమందితో డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…