రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు కుదరని పని. ఆ క్రమంలోనే చాలామంది నేతలు బీపీ, షుగర్ ఎట్సెట్రాలతో ఇబ్బందిపడుతుంటారు. తాను కూడా ఆ కోవలోకే వస్తానని వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు.
రాజకీయాలపై రోజా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీపీ, షుగర్ వచ్చాయని రోజా అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయిందని, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయిందని చెప్పారు.
అయితే, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త ఒత్తిడి తగ్గి కాంపెన్సేట్ అయిందని సెటైర్ వేశారు. రాజకీయాలంటేనే ఎన్నో టెన్షన్స్ ఉంటాయని, ఎంతోమందితో డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on April 8, 2026 5:10 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…