రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు కుదరని పని. ఆ క్రమంలోనే చాలామంది నేతలు బీపీ, షుగర్ ఎట్సెట్రాలతో ఇబ్బందిపడుతుంటారు. తాను కూడా ఆ కోవలోకే వస్తానని వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు.
రాజకీయాలపై రోజా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీపీ, షుగర్ వచ్చాయని రోజా అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయిందని, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయిందని చెప్పారు.
అయితే, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త ఒత్తిడి తగ్గి కాంపెన్సేట్ అయిందని సెటైర్ వేశారు. రాజకీయాలంటేనే ఎన్నో టెన్షన్స్ ఉంటాయని, ఎంతోమందితో డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు తక్కువ అని… కొత్త కథలు ప్రయత్నించరని.. ఎప్పుడూ మాస్ మంత్రమే పఠిస్తుంటారని.. కథలన్నీ హీరోల చుట్టూనే…
ఈ రోజుల్లో పెద్ద సినిమాలకే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అలాంటపుడు చిన్న స్థాయి సినిమాలను జనాల్లోకి…
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా…
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…