రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు కుదరని పని. ఆ క్రమంలోనే చాలామంది నేతలు బీపీ, షుగర్ ఎట్సెట్రాలతో ఇబ్బందిపడుతుంటారు. తాను కూడా ఆ కోవలోకే వస్తానని వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు.
రాజకీయాలపై రోజా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీపీ, షుగర్ వచ్చాయని రోజా అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయిందని, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయిందని చెప్పారు.
అయితే, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త ఒత్తిడి తగ్గి కాంపెన్సేట్ అయిందని సెటైర్ వేశారు. రాజకీయాలంటేనే ఎన్నో టెన్షన్స్ ఉంటాయని, ఎంతోమందితో డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on April 8, 2026 5:10 pm
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్కు తిరుగులేదని సర్వేలు చాటి చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు.. అధికార…