తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. చిత్రీకరణ ఆల్మోస్ట్ అయిపోయిందని రజని బయటికి చెబుతున్నా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బయటికి రాలేనంత బిజీ పనుల్లో తలమునకలై ఉన్నాడు. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2కి క్యామియోల సమస్య వచ్చి పడిందట. ఫస్ట్ పార్ట్ లో మేజిక్ చేసిన శివరాజ్ కుమార్. మోహన్ లాల్ ఇందులోనూ కొనసాగుతారు. వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు.
కాకపోతే ఈసారి వీళ్లకు తోడుగా షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతిని రంగంలోకి దించాలని దానికి అనుగుణంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు నెల్సన్. అంతకు ముందే బాలకృష్ణ కోసం ఎంతో ట్రై చేశారు కానీ పనవ్వలేదు. గెస్టు పాత్రలకు బాలయ్య చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. అయినా సరే రజనితో స్నేహం వల్ల చేయొచ్చేమో అని అందరూ అనుకున్నారు. లెన్త్ తో పాటు రెమ్యునరేషన్ ఇష్యూ ఇది జరగకుండా ఆపి ఉండొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పుడు కొత్త షాక్ ఏంటంటే షారుఖ్ ఖాన్ జైలర్ 2 చేయలేనని చెప్పేశాడట. తన స్వంత మూవీ కింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన కింగ్ ఖాన్ దాన్ని డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ షూట్ ఇంకా పెండింగ్ ఉండటంతో వేరే సినిమాలకు టైం కేటాయించే అవకాశం లేదని చెప్పినట్టు వినికిడి. విజయ్ సేతుపతి గురించి కూడా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి కానీ టీమ్ నిర్ధారణగా చెప్పే వరకు ఈ కన్ఫ్యూజన్ పోయేలా లేదు.
ఇదంతా కొనసాగుతోంది కాబట్టే విడుదల తేదీ విషయంలో జైలర్ 2 టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముందు అనుకున్న డేట్ అయితే ఆగస్ట్ రెండో వారం. జైలర్ ఇదే టైంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది. అదే సెంటిమెంట్ కొనసాగించాలని నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్. కానీ పరిస్థితులు దానికి ఎంత మేర సహకరిస్తాయో అనుమానంగా ఉంది. ఒకవేళ మిస్ అయితే దీపావళి అప్పుడూ కుదరకపోతే రజని పుట్టినరోజు డిసెంబర్ 12 లాక్ చేస్తారు. చూడాలి మరి ఏం జరగనుందో.
This post was last modified on April 8, 2026 4:52 pm
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…