Political News

నిఘా ఏమైంది: వైసీపీ కలివిడి రాజకీయం..!

రాష్ట్రంలో ప్రభుత్వానికి పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంది. ఇక తరచుగా సీఎం చంద్రబాబు పలు అంశాలపై సర్వేలు కూడా చేయిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ వరకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దీంతో ప్రజల నాడి ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమేరకు అమలవుతున్నాయి, ఎలాంటి సంతృప్తి వ్యక్తమవుతోంది వంటి విషయాలను తెలుసుకుంటున్నారు.

మరి ఇంత నిఘా ఉన్నప్పటికీ కోనసీమ ఇసుక దోపిడీ వ్యవహారంపై ప్రభుత్వానికి ఎందుకు సమాచారం అందలేదు అనేది కీలకంగా మారింది. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా కోనసీమ జిల్లాలోని దాదాపు 18 రీచుల్లో ఇసుకను నాయకులు పంచుకుంటున్నారని పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చేవరకు సర్కారుకు తెలియకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వ్యవస్థలు, ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఏం జరిగింది..?

కోనసీమలోని గోదావరి నది నుంచి నాణ్యమైన ఇసుక ఉత్పత్తి అవుతుంది. దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. అయితే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తోంది. దీనిని ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభించింది. అయితే కోనసీమలో వైసీపీ నాయకులు కొందరు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఇసుకను వ్యాపారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు తెరమీదికి వచ్చాయి. దీనికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారని సర్కారుకు సమాచారం అందింది.

ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గత ఏడాది కాలంగా ఇక్కడ జరుగుతున్న పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో నిఘా ఎక్కడ తప్పిందో కూడా వివరాలు ఆరా తీశారు. నిజానికి క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల నాయకులు కలివిడిగా ఉండాలని ఆదేశిస్తే, నాయకులు ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకులతో కలిసిపోయి ఇసుకను దారిమళ్లించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. మరి ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on April 1, 2026 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

24 minutes ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

44 minutes ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

51 minutes ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

1 hour ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

2 hours ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

3 hours ago