తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళ వెట్రిగ కగజం(టీవీకే) పార్టీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఆదివారం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ తన పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతేకాకుండా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థుల ప్రకటనతో పాటుగా తమ పార్టీని గెలిపిస్తే ఏం చేస్తానన్న విషయాన్ని కూడా విజయ్ ప్రకటించారు. విజయ్ చేసిన ప్రకటన, ఆయన పార్టీ అభ్యర్ధుల పైనా, అందులో విజయ్ అనుసరించిన తీరుపైనా ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. వచ్చీ రావడంతోనే రెండు స్థానాల్లో విజయ్ పోటీ చేస్తున్న వైనంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత జనసేన పేరిట పార్టీ పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు వచ్చీరావడంతోనే రెండు స్థానాల్లో పోటీ చేశారు. చిరు ఓ చోట ఓడిపోగా, మరో చోట విజయం సాధించారు. ఇక పవన్ అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఈ లెక్కన తొలి ప్రయత్నంలోనే రెండు స్థానాల్లో పోటీ చేయడం ఫలించకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఇక ఓ సీటును తన కారు డ్రైవర్ కుమారుడికి విజయ్ కేటాయించారు. ఈ ప్రయోగం పెద్దగా ఫలించకపోవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఓ లారీ డ్రైవర్ కు తన పార్టీ టికెట్ ఇచ్చినా ఫలితం రాలేదు. నిన్నటిదాకా సినిమాల్లో నటించిన విజయ్… అదే సినిమాటిక్ పోకడలను వీడకుండా డ్రైవర్ కుమారుడికి సీటిచ్చానని చెప్పుకుంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. గెలుపు గుర్రాలను వెతకాల్సింది పోయి సానుభూతి మీదనే ఆధారపడితే… ఈ తరహా ఎంపికలే ఉంటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
తన పార్టీకి అధికారం కట్టబెడితే తానేం చేస్తానన్న విషయాన్ని ప్రస్తావించిన విజయ్… భారీ హామీలనే ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే..ప్రజా ధనాన్ని దుర్వనియోగం చేయనని, అవినీతికి పాల్పడమని, మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రకటించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును మారుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతమాత్రం వ్యతిరేకంగా వెళ్లబోమని విజయ్ హామీ ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో టీవీకేకు ఓటు వేసి తనకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇక కరూర్ లో నిర్వహించిన తన రోడ్ షోలో జరిగిన ప్రమాదం, అందులో 40 మంది చనిపోయిన వైనం విజయ్ ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు విజయ్ కి అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులు విధించింది. కరూర్ ఘటన తర్వాత విజయ్ అసలు బయటకే రాలేని పరిస్థితులు కొనసాగాయి.
జరిగిన ప్రమాదాన్ని టాకిల్ చేసే విషయంలోనూ విజయ్ విఫలమయ్యారన్న వాదన లేకపోలేదు. అంతేకాకుండా తన సినీ గ్లామర్ ను వినియోగించుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తానంటూ విజయ్ సాగుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తంగా తన చుట్టూ నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఏమాత్రం చెరిపేసే యత్నం చేయని విజయ్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టడం కష్టమేనన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…