ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో… రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… ఈ ఘటన వెనుక రాజధానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ మంటలకు కారణం కావచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే సదరు పైపులకు కాపలా ఉన్న వాచ్ మన్ తనకు సెలవు ఇవ్వని కారణంగా వాటికి నిప్పు పెట్టినట్టుగా తాజాగా తేలింది. ఈ మేరకు నిందితుడిని విచారించిన పోలీసులు బాధితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.
రాజధాని నిర్మాణ పనుల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా పాలుపంచుకుంటోంది. పనుల్లో వినియోగించే పైపులను ముందుగానే పని ప్రదేశానికి తరలించిన ఆ సంస్థ… వాటికి కాపలాగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. బెండపూడికి చెందిన రాము ఈ విధుల్లో ఉన్నాడు. అయితే ఈ నెల 23న తన బంధువులొకరు మరణించారని, సెలవు కావాలని కోరగా… అందుకు సూపర్ వైజర్ అంగీకరించలేదట.
దీంతో కోపం పెంచుకున్న రాము… ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధపడగా.. రాత్రి కూడా డ్యూటీ చేయాలని చెప్పడంతో అతడు మరింత ఆగ్రహానికి గురై ఏదో ఒకటి చేసి అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ సంఖ్యను పెంచేలా చేయాలని తలచాడు.
ముందుగానే డీజిల్ ను ఓ సీసాలో నింపుకుని పైపుల వద్దకు కాపలా వెళ్లిన రాము…రాత్రి 10.30 గంటలకు పైపులకు నిప్పు పెట్టాడు. అయితే మంటలను చూసి భయపడ్డ రాము… వాటిని ఆర్పేందుకు యత్నించాడు. ఎంతకీ మంటలు అదుపులోకి రావడంతో అతడే సూపర్ వైజర్ కు ప్రమాదం గురించిన విషయాన్ని చెప్పాడు.
ముందుగా 9.30 గంటల సమయంలో అంతా బాగున్నట్లు ఫొటో పెట్టిన రాము… 10.35 గంటల సమయంలో మంటలు చెలరేగుతున్న ఫొటోను పంపాడు. అయితే తానే ఈ మంటలకు కారణమన్న విషయాన్నిదాచాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా…రాము ఎట్టకేలకు తానే అగ్గి రాజేసినట్లు ఒప్పుకున్నాడు.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…