Political News

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు.

చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”కనీసం ఈ రోజు అయినా ఆ 11 మంది వస్తారని ఆశించా. అమరావతి తీర్మానాన్ని బలపరచి తమ తప్పులకు పశ్చాత్తాప పడతారని భావించా. అయితే చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం గానీ, నిజాయతీ గానీ వారికి లేవని నాకు అర్థం అయిపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత అయినా గుణపాఠం నేర్చుకుంటారని అనుకున్నా. ఆ ఉద్దేశ్యమే వారికి లేదని తేలిపోయింది” అని వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం కాగానే అయ్యన్న చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హర్షాతిరేకం వ్యక్తమైంది.

వాస్తవానికి అమరావతికి తామేమీ వ్యతిరేకం కాదని వైసీపీ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరావతికి మద్దతుగానే అమరావతి పరిధిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కూడా అమరావతి పరిధిలోనే నిర్మించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇదే వాదనను ఇటీవలే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అయినప్పటికీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ,లో పాలుపంచుకోవడానికి, తీర్మానానికి మద్దతు తెలిపేందుకు వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. జగన్ అయితే ఏకంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయాలను గుర్తు చేస్తూనే స్పీకర్ వైసీపీ సభ్యుల తీరును ఎండగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

14 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

20 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

34 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago