Political News

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు.

చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”కనీసం ఈ రోజు అయినా ఆ 11 మంది వస్తారని ఆశించా. అమరావతి తీర్మానాన్ని బలపరచి తమ తప్పులకు పశ్చాత్తాప పడతారని భావించా. అయితే చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం గానీ, నిజాయతీ గానీ వారికి లేవని నాకు అర్థం అయిపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత అయినా గుణపాఠం నేర్చుకుంటారని అనుకున్నా. ఆ ఉద్దేశ్యమే వారికి లేదని తేలిపోయింది” అని వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం కాగానే అయ్యన్న చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హర్షాతిరేకం వ్యక్తమైంది.

వాస్తవానికి అమరావతికి తామేమీ వ్యతిరేకం కాదని వైసీపీ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరావతికి మద్దతుగానే అమరావతి పరిధిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కూడా అమరావతి పరిధిలోనే నిర్మించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇదే వాదనను ఇటీవలే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అయినప్పటికీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ,లో పాలుపంచుకోవడానికి, తీర్మానానికి మద్దతు తెలిపేందుకు వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. జగన్ అయితే ఏకంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయాలను గుర్తు చేస్తూనే స్పీకర్ వైసీపీ సభ్యుల తీరును ఎండగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 28, 2026 3:23 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ayyanna

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

3 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

6 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

7 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

7 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

8 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

8 hours ago