నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు.
చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”కనీసం ఈ రోజు అయినా ఆ 11 మంది వస్తారని ఆశించా. అమరావతి తీర్మానాన్ని బలపరచి తమ తప్పులకు పశ్చాత్తాప పడతారని భావించా. అయితే చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం గానీ, నిజాయతీ గానీ వారికి లేవని నాకు అర్థం అయిపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత అయినా గుణపాఠం నేర్చుకుంటారని అనుకున్నా. ఆ ఉద్దేశ్యమే వారికి లేదని తేలిపోయింది” అని వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం కాగానే అయ్యన్న చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హర్షాతిరేకం వ్యక్తమైంది.
వాస్తవానికి అమరావతికి తామేమీ వ్యతిరేకం కాదని వైసీపీ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరావతికి మద్దతుగానే అమరావతి పరిధిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కూడా అమరావతి పరిధిలోనే నిర్మించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇదే వాదనను ఇటీవలే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అయినప్పటికీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ,లో పాలుపంచుకోవడానికి, తీర్మానానికి మద్దతు తెలిపేందుకు వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. జగన్ అయితే ఏకంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయాలను గుర్తు చేస్తూనే స్పీకర్ వైసీపీ సభ్యుల తీరును ఎండగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, అయితే వరల్డ్ బిల్డింగ్ లేదా ప్యాన్ ఇండియా. వీటి పేరుతో ఎలివేషన్లు ఉన్న…
ఏపీలో చేరికల పర్వం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆపరేషన్…
మీరు భారతీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఇది…
మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…