నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు.
చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”కనీసం ఈ రోజు అయినా ఆ 11 మంది వస్తారని ఆశించా. అమరావతి తీర్మానాన్ని బలపరచి తమ తప్పులకు పశ్చాత్తాప పడతారని భావించా. అయితే చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం గానీ, నిజాయతీ గానీ వారికి లేవని నాకు అర్థం అయిపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత అయినా గుణపాఠం నేర్చుకుంటారని అనుకున్నా. ఆ ఉద్దేశ్యమే వారికి లేదని తేలిపోయింది” అని వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం కాగానే అయ్యన్న చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హర్షాతిరేకం వ్యక్తమైంది.
వాస్తవానికి అమరావతికి తామేమీ వ్యతిరేకం కాదని వైసీపీ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరావతికి మద్దతుగానే అమరావతి పరిధిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కూడా అమరావతి పరిధిలోనే నిర్మించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇదే వాదనను ఇటీవలే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అయినప్పటికీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ,లో పాలుపంచుకోవడానికి, తీర్మానానికి మద్దతు తెలిపేందుకు వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. జగన్ అయితే ఏకంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయాలను గుర్తు చేస్తూనే స్పీకర్ వైసీపీ సభ్యుల తీరును ఎండగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 28, 2026 3:23 pm
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…