Political News

లాక్ డౌన్ భయాలకు కారణమెవరు?

కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. తాజాగా అలాంటి పరిస్థితులు లేకున్నా కూడా దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదంటూ గడచిన రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అయితే ఓ రేంజిలో చర్చ సాగుతోంది.

వెరసి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయితే లాక్ డౌన్ వార్తలు నిరాధారమంటూ స్వయంగా కేంద్రం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది. మరి లాక్ డౌన్ పరిస్థితులు లేకున్నా… ఆ దిశగా దేశ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తడానికి కారణమెవరు? అంటే… సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, దాని ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై మోదీ ఓ కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగంలో ఆయన లాక్ డౌన్ పదాన్ని వాడారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం కరోనా నాటి పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని తెలిపారు.

ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని కూడా మోదీ పిలుపునిచ్చారు. మోదీ నోట నుంచి లాక్ డౌన్ అన్న పదం వినిపించినంతనే దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదన్న ప్రచారం చిన్నగా మొదలై గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. రెండు రోజులు గడిచేసరికి ఈ భయాందోళనలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఇక్కడ కేవలం అటువంటి పరిస్థితులు వచ్చినా.. దేశ ప్రజలు కలిసి కట్టుగా నిలబడాలని పిలుపు ఇవ్వడమే ప్రధాని ఉద్దేశం అనేది కాదనలేని విషయం.

ఈ ప్రచారం విన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముక్కున వేలేసుకున్నారు. లాక్ డౌన్ తరహా ఆంక్షలేవీ అమలు చేసే ఉద్దేశ్యం లేదని, అంతేకాకుండా ఆ దిశగా అసలు చర్చే జరగలేదని కేంద్ర మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. అలాగని వెంటనే ఈ తరహా ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రంగంలోకి దిగారు.

దేశంలో మరోమారు లాక్ డౌన్ తరహా ఆంక్షలను అమలులోకి తీసుకురావాలన్న ఆలోచనేది లేదని, దీనిపై జరుగుతున్న ప్రచారమంతా ఊహాజనితమైనదని నిర్మల ప్రకటించారు. తాజాగా శుక్రవారం సోషల్ మీడియా వేదికగా హర్దీప్ సింగ్ పూరి ఓ కీలక పోస్టును పెట్టారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలముకున్నప్పటికీ… దేశ అవసరాలకు సరిపడా ఇంధనం వస్తోందని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ అన్న మాటకే ఆస్కారం లేదని అందులో పూరీ ఓ విస్పష్ట ప్రకటన చేశారు. లాక్ డౌన్ దిశగా సాగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Kumar

Recent Posts

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

2 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

12 hours ago