ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ.. ఆయన అనుచరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వాహనాలపై రాళ్లు పడడంతో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఏం జరిగింది?
శ్రీరామనవమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరిజిల్లాలోని ఆకివీడులో ఉన్న పెద్దరామాలయానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ వచ్చారు. అయితే.. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న కొంత మంది క్రిస్టియన్ సంఘాలకు చెందిన వారు.. నిరసన వ్యక్తం చేశారు. తమ వర్గాన్ని కించపరుస్తున్నారని.. దూషి స్తున్నారని ఆరోపిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే.. రఘురామ ఈ నిరసనలను పట్టించుకోకుండా.. ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన క్రిస్టియన్ సంఘాల్లోని కొందరు యువత తమ వెంట తెచ్చుకున్న మేకులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని.. వారు కూడా రెచ్చగొట్టారని కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆయన పనేనా?
ఇదిలావుంటే.. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్కుమార్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రమేయంతోనే ఈ దాడి జరిగి ఉంటుందని రఘురామ వర్గీయులు చెబుతున్నారు.
గతంలో రఘురామను కస్టడీలో టార్చర్ చేసిన వ్యవహారంలో సునీల్కుమార్పై కేసు ఉంది. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ఇరువురి మధ్య వాగ్యుద్ధం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడి వెనుక ఆయన ప్రమేయం ఉందన్న సందేహాలు వస్తున్నాయి.
This post was last modified on March 27, 2026 3:01 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…