ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దండెత్తిన యువత… కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వదలలేదు. ఈ పరిణామాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తెగ సంబరపడిపోయింది. అయితే జంతర్ మంతర్ నిరసనలు ఇంకా పూర్తిగా మరిచిపోనే లేదు…. అప్పుడే ఇండియా కూటమి వంతు కూడా వచ్చేసింది. ఇండియా కూటమి పాలనలోని జార్ఖండ్ లో ఇప్పుడు జంతర్ మంతర్ తరహా ఆంధోళనలే కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు పలికింది. బీజేపీకి యువత ముచ్చెమటలు పట్టించారని సంబరపడ్డ కాంగ్రెస్ కూ ఇప్పుడు అదే యువత మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉందని చెప్పక తప్పదు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న తాజా ఆందోళనల విషయానికి వస్తే… జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షా పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్న ఈ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని.. తిరిగి పరీక్షను నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్ తో దేవేంద్ర నాధ్ మహతో అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద విద్యార్థులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ నిరసనలను అక్కడి జార్ఖండ్ ముక్తి మోర్చా (ఈ పార్టీ ఇండియా కూటిమిలోని కీలక భాగస్వామిగా కొనసాగుతోంది) అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ నిరసనలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ నిరసనలకు తరలివస్తున్నారు.
తాజాగా నిరసనలకు నేతృత్వం వహిస్తున్న మహతో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సోరేన్ తమతో చర్చలు జరిపి… విద్యార్థులకు న్యాయం చేసే దాకా దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ జార్ఖండ్ విద్యార్థుల నిరసనలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకుంటే… ఏ పార్టీ ప్రభుత్వాన్ని అయినా విడిచిపెట్టేది లేదని కాక్రోచ్ పార్టీ తేల్చి చెప్పింది. వెరసి ఈ నిరసనలు కూడా జంతర్ మంతర్ నిరసనల స్థాయికి చేరే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 3, 2026 3:25 pm
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…