ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దండెత్తిన యువత… కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వదలలేదు. ఈ పరిణామాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తెగ సంబరపడిపోయింది. అయితే జంతర్ మంతర్ నిరసనలు ఇంకా పూర్తిగా మరిచిపోనే లేదు…. అప్పుడే ఇండియా కూటమి వంతు కూడా వచ్చేసింది. ఇండియా కూటమి పాలనలోని జార్ఖండ్ లో ఇప్పుడు జంతర్ మంతర్ తరహా ఆంధోళనలే కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు పలికింది. బీజేపీకి యువత ముచ్చెమటలు పట్టించారని సంబరపడ్డ కాంగ్రెస్ కూ ఇప్పుడు అదే యువత మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉందని చెప్పక తప్పదు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న తాజా ఆందోళనల విషయానికి వస్తే… జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షా పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్న ఈ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని.. తిరిగి పరీక్షను నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్ తో దేవేంద్ర నాధ్ మహతో అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద విద్యార్థులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ నిరసనలను అక్కడి జార్ఖండ్ ముక్తి మోర్చా (ఈ పార్టీ ఇండియా కూటిమిలోని కీలక భాగస్వామిగా కొనసాగుతోంది) అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ నిరసనలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ నిరసనలకు తరలివస్తున్నారు.
తాజాగా నిరసనలకు నేతృత్వం వహిస్తున్న మహతో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సోరేన్ తమతో చర్చలు జరిపి… విద్యార్థులకు న్యాయం చేసే దాకా దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ జార్ఖండ్ విద్యార్థుల నిరసనలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకుంటే… ఏ పార్టీ ప్రభుత్వాన్ని అయినా విడిచిపెట్టేది లేదని కాక్రోచ్ పార్టీ తేల్చి చెప్పింది. వెరసి ఈ నిరసనలు కూడా జంతర్ మంతర్ నిరసనల స్థాయికి చేరే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 3, 2026 3:25 pm
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…