పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సామాన్యులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇక, వ్యాపారులకు రవాణా నిలిచిపోయి.. వ్యాపారాలు ఆగిపోయాయి. ఇక, చమురు సమస్య వెంటాడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదిలావుంటే.. కేంద్రంలోని సర్కారుకు పశ్చిమాసియా ప్రభావంతో కీలకమైన రవాణా, గ్యాస్ దిగుమతులు.. సహా ఎగుమతులు కూడా నిలిచిపోవ డం కంటిపై కునుకులేకుండా చేస్తోంది.
ఈ పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు.. పరిశీలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమించింది. అయినా.. కూడా సమస్య ఎటు నుంచి ఎటు వైపు మారుతుందో తెలియని ఒక సందిగ్దత నెలకొంది. ఎందుకంటే.. ఐదురోజులు యుద్ధానికి విరామం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఇజ్రాయెల్ ఒత్తిడి పెరిగిపోయింది. మరోవైపు.. ప్రతిపక్ష డెమొక్రాట్లు కూడా ట్రంప్ ను ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచ మీడియా కూడా అనేక సూటి ప్రశ్నలు సంధిస్తోంది.
ఈ నేపథ్యంలో యుద్ధం ఆగుతుందా.. ఈ క్షణమే కొనసాగుతుందా? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం భారత్పై మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ సైతం పశ్చిమాసియాలో ఏం జరుగుతోందన్న విషయాలపై నిరంతరం ఆరా తీస్తున్నారు. దీంతో ఆయన ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్ని దాదాపు రద్దు చేసుకున్నారని పీఎంవో వర్గాల తెలిపాయి.
దీనికి మరోకారణం కూడా..
అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్న ప్రధాని మోడీ రద్దు చేసుకోవడం వెనుక మరో రీజన్ కూడా ఉందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలకు మోడీ వెళ్తే.. కేంద్రం గురించి పొగుడుకోవాలి. తప్పదుకదా!. కానీ.. పశ్చిమాసియా ప్రభావంతో సిలిండర్లపై 60 రూపాయలు పెంచారు. పెట్రోల్పై 2.3 రూపాయలు పెంచారు.
ఇవన్నీ.. ఇతర వస్తు అంతర్గత రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆయా ప్రచారానికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని.. భావిస్తున్నారు. వెళ్తే.. తనను, తన ప్రభుత్వాన్ని కూడా మోడీ పొడుగుకోక తప్పదు. ఇదే జరిగితే.. విపక్షాలు మరింత కార్నర్ చేస్తాయి. సో.. అన్నీ ఆలోచించే ఆయన రద్దు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…