Political News

మార్పు దిశ‌గా మాచ‌ర్ల.. !

ప‌ల్నాడు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కించుకున్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన కేసు ఆయ‌న‌ను వెంటాడింది. ఆ త‌ర్వాత‌.. టీడీపీ నాయ‌కుల జంట హ‌త్య‌ల కేసు కూడా పిన్నెల్లి సోద‌రుల‌పై ఉండ‌డంతో ఇటీవ‌లే జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం మాచ‌ర్ల‌లో పిన్నెల్లి ప్ర‌భావం ఎంత‌? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. వాస్త‌వానికి.. ఈవీఎం కేసులో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్ల‌రాద‌న్న కోర్టు ష‌ర‌తులు ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో గుంటూరులోనే ఆయ‌న ఉంటున్నారు. లేదా.. హైద‌రాబాద‌కు మ‌కాం మార్చారు. కానీ.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యాల‌ను మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు.

టీడీపీ హ‌వా..

ప్ర‌స్తుతం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే పోచా బ్రహ్మానంద‌రెడ్డి హ‌వా సాగుతోంది. అయితే.. ఇది వివాదంగా కాదు. అభివృద్ధి, సంక్షేమం వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అడుగులు వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్పుడు ఉన్న క‌క్ష‌లు.. ఇప్పుడు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా ఏం కావాలో.. అది చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

గ‌తంలో ఉన్న వ‌ర్గపోరు లేకుండా చేసేందుకు కూడా పోచా ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి ఒక‌ప్పుడు కొన్ని మండ‌లాల ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో కొన‌సాగుతున్న ప‌రిస్థితి ఉంది.. కానీ.. తాజాగా ఆయా మండ‌లాల్లోని ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

గ‌తంలో టీడీపీలో ఉన్నార‌న్న కారణంగా.. నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌రిమేసి.. వేధించిన ప‌రిస్థితులు ఉన్నాయి. కానీ, ఇప్పుడు దాదాపు అలాంటి ప‌రిస్థితి లేకుండా ఉండ‌డంతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

Kumar

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 minutes ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

26 minutes ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

2 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

3 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

5 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

8 hours ago