Political News

బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నడూ ఈ రెండు ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించలేదు. కానీ, తాజాగా అసలు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రెండుసార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. లేదంటే ఎంఐఎంకు హైదరాబాద్ ను కాంగ్రెస్ ధారాదత్తం చేస్తుందని రామచందర్ రావు విమర్శించారు. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు లేదని, ఫ్యూచర్ తమదేనని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు. తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కాబట్టి ఈ క్లారిటీ ఇస్తున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

కుటుంబ పాలన కోసమా? కాళేశ్వరం కోసమా? దేనికి బీఆర్ఎస్ లో ఉండాలి అన్న భావన బీఆర్ఎస్ నేతల్లో వచ్చిందని, అందుకే బీఆర్ఎస్ నుండి బీజేపీకి వారు క్యూ కడుతున్నారని అన్నారు.

అందుకే, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, బీఆర్ఎస్ లోనే ఉండండి అని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్, కేటీఆర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తమ మందను కాపాడుకోవడం కోసం తండ్రికొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు.

Kumar

Recent Posts

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

దక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. ఆమె…

17 minutes ago

తెలంగాణ హంత‌కుడిది – జ‌గ‌న్‌ది ఒకే పోలిక‌: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఓ వ్య‌క్తి ఆరుగురిని…

57 minutes ago

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

4 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

4 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

5 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

6 hours ago