దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ తిరస్కరిస్తారోననే ఇన్ సెక్యూరిటీ అక్కడి దర్శక నిర్మాతలకు పెరిగిందన్న మాట వాస్తవం. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన అల్ఫా గత ఏడాది డిసెంబర్ 25 విడుదల కావాల్సింది. అలియా భట్, వామికా గబ్బి లేడీ గూఢచారులుగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్.
అయితే పోస్ట్ ప్రొడక్షన్ తదితర కారణాల వల్ల క్రిస్మస్ కు రాలేకపోయింది. సరే కొత్త డేట్ అంటూ తర్వాత ఏప్రిల్ 17 అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్ల హడావిడి లేకపోవడంతో జనాలకు డౌట్ వచ్చింది. తాజాగా జూలై 10కి మరోసారి పోస్ట్ పోన్ చేస్తూ కొత్త ప్రకటన ఇచ్చారు. అంటే ముచ్చటగా మూడోసారి మారిందన్న మాట. ఇలా చేయడానికి కారణాలు చాలా సింపుల్.
దురంధర్ రివెంజ్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాని ప్రభావం ఎంతలేదన్నా నెల నుంచి యాభై రోజుల దాకా ఉంటుంది. అలాంటప్పుడు మధ్యలో అల్ఫా వస్తే లేనిపోని పోలికలతో ఇబ్బంది తలెత్తుతుంది. దురంధర్ వచ్చినప్పటి నుంచి నెటిజెన్లు టార్గెట్ చేస్తోంది యష్ సంస్థ తీసిన టైగర్, వార్, పఠాన్ లాంటి స్పై సినిమాలనే. ఇప్పుడు అల్ఫాకు ఇదే ఇబ్బంది రావొచ్చని భావించి నిర్ణయం మార్చుకున్నారట.
ఏది ఏమైనా అలియా భట్ మూవీకి ఇంత కష్టం రావడం విచిత్రమే. ఇంతకు ముందులా జనాలు స్పై సినిమాల్లో ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు, బికినీ పాటలు ఇష్టపడటం లేదు. దీన్ని మార్చిన ఘనత దురంధర్ కే దక్కుతుంది. అల్ఫాలో అలాంటివి ఉన్నాయో లేదో ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం.
యష్ స్పై యునివర్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, టైగర్ శ్రోఫ్, అలియా భట్, వామికా గబ్బి ఇలా అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి అవెంజర్స్ తరహాలో ఒక మెగా మూవీ తీయాలనేది ఆదిత్య చోప్రా కోరిక. కానీ బాక్సాఫీస్ ఫలితాలు, తాజా పరిణామాలు చూస్తుంటే అదంతా సులభంగా నెరవేరేలా లేదు.
This post was last modified on March 9, 2026 1:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…