Political News

కవిత అరెస్ట్… అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఇటీవ‌ల ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో స్థానిక సీబీఐ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో రాష్ట్ర‌స్థాయిలో జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన ఆమె.. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మూసీన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భారీ క‌ట్ట‌డాల‌కు వ్య‌తిరేకంగా మంగ‌ళ‌వారం అనూహ్యంగా ఆమె నిర‌స‌న‌కు దిగారు. సాయంత్రం 5 గంట‌ల నుంచి నార్సింగ్‌లోని ఓ నిర్మాణం ముందు త‌న కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి నిర‌స‌న‌కు దిగారు.

పేద‌లు, బ‌డుగుల ఇళ్ల‌ను కూల్చి వేస్తున్న హైడ్రాకు.. పెద్ద‌లు నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భారీ భ‌వ‌నాలు క‌నిపించ‌డం లేదా? అని క‌విత ప్ర‌శ్నించారు. మూసి న‌దిని కొంద‌రు అక్ర‌మార్కులు ఆక్ర‌మిస్తున్నార‌ని.. అయినా హైడ్రాకు అవేవీ క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. పేద‌లు అప్పులు చేసి నిర్మించుకున్న చిన్న‌పాటి ఇళ్ల‌ను మూసీ వంక‌తో తొల‌గిస్తున్నార‌ని.. రాత్రికి రాత్రి వాటిని తొల‌గిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. తాను పేద‌ల ప‌క్షాన పోరాటం చేస్తున్న‌ట్టు చెప్పారు. హైడ్రా అధిప‌తి రంగ‌నాథ్ వ‌చ్చి.. త‌న‌కు స‌మాధానం చెప్పాల‌ని క‌విత భీష్మించారు.

ఈ క్ర‌మంలో రాత్రి పొద్దు పోయే వ‌ర‌కు కూడా క‌విత రోడ్డుపైనే కూర్చున్నారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి అక్క‌డే నిర‌స‌న వ్య‌క్తం చేశారు. హైడ్రాకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో చీక‌టి ప‌డ‌డం.. స్థానికంగా ఎలాంటి వెలుగు లేక‌పోవ‌డంతో కార్య‌క‌ర్త‌లు.. త‌మ సెల్ ఫోన్ల‌లోని టార్చ్ ల‌ను ఆన్ చేయ‌డంతో ఆ వెలుగులోనే క‌విత త‌న నిర‌స‌న‌ను కొన‌సాగించారు.

అయితే.. ఈ వ్య‌వ‌హారంపై హైడ్రా స్పందించ‌లేదు. కాగా.. గ‌తంలోనే ఈవ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నిర‌స‌న వ్య‌క్తం చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ హైడ్రాకు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు. పేద‌ల ఇళ్ల‌ను కూల్చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దీనిపై అప్ప‌ట్లోనే రంగ‌నాథ్ స్పందించారు. తాము నిబంధ‌న‌ల మేర‌కే వెళ్తున్నామ‌ని చెప్పారు. ఇక‌, ఇప్పుడు క‌విత నిర‌స‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

కవిత అరెస్టు

ధ‌ర్నా చేస్తున్న క‌విత‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు ధ‌ర్నా చేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నిర‌స‌న‌ను విర‌మించాల‌ని సూచించారు. అయితే తాము శాంతి యుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నామని..ఇది త‌మ హ‌క్కు అనిప‌లువురు జాగృతి నేత‌లు తెలిపారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చి త‌మ‌కు స‌మాధానం చెప్పాల‌ని క‌విత డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు క‌విత‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే.. ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌ను అడ్డుకున్నారు. దీంతో వారి మ‌ధ్య స్వ‌ల్ప తోపులాట చోటు చేసుకుంది.

Kumar

Recent Posts

జెన్‌-జీ రాజకీయం మొదలుపెట్టిన పవన్

ఏపీ అధికార పార్టీ జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో యువ‌త‌రాన్ని ఆకర్షించేందుకు..…

20 minutes ago

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

3 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

5 hours ago

గ్రేటర్ హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్స్‌… ప్లాన్ ఏంటి సీఎం సార్?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే పాల‌క మండ‌లి కూడా ర‌ద్ద‌యింది. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లోకి…

5 hours ago

అనుపమలో కొత్త కోణం బయటికొచ్చిందే

ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…

6 hours ago

సోష‌ల్ ఉద్య‌మం: ఏపీలో తెలంగాణ విగ్ర‌హాలు|

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంద‌రికీ తెలిసిందే. బొద్దింక‌ల పార్టీగా ప్రారంభ‌మై.. ఒక వైపు…

6 hours ago