“ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోతది.. పార్టీకి ఏం నష్టం వస్తది. అందుకే తేల్చుకునేటందుకు వచ్చా“ అంటూ.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చడీచప్పుడు లేకుండానే ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో వాలిపోయారు. ఆయన ఢిల్లీకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాకపై ఎలాంటి సమాచారం లేదని తెలిసింది.
ఇప్పటికే.. రాజ్యసభ సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. మార్చి 5తో నామినేషన్ల ఘట్టం కూడా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఎవరి దారిలో వారు తమకు సీటు దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కోటాలో రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి ఇప్పటికే మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి ఖరారైందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈయనను గతంలో ఉపరాష్ట్రపతి పదవికి బరిలో నింపారు. ఆయన ఓడిపోయిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనను పెద్దల సభకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, మరో సీటు వాస్తవానికి కాంగ్రెస్ నాయకుడిదే. జాతీయ నేత అభిషేక్ సింఘ్వీ తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీటు కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వీహెచ్ ఎవరికీ చెప్పకుండానే నేరుగా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరే తేల్చుకునేందుకు వెళ్లారు.
తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని గతంలోనే కోరానని వీహెచ్ తెలిపారు. పార్టీలో నమ్మకంగా ఉన్నానని.. పార్టీ కోసం అన్నీ వదులుకున్నానని చెప్పారు. గత పదేళ్ల నుంచి తనకు ఏ పదవి లేదన్నారు. తన మనసులో కోరికను సీఎం రేవంత్ కు కూడా చెప్పానన్నారు. ఎందుకైనా మంచిదన్నట్టుగా ఢిల్లీ పెద్దలను కలిసి వెళ్లేందుకు వచ్చానన్నారు. పార్టీ కోసం పనిచేసిన తనపై 16 కేసులు పెట్టారని బీఆర్ ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
This post was last modified on March 1, 2026 12:42 am
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…