ponguleti srinivas reddy
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు తమ ఇళ్లు కోల్పోయిన బాధితులు అలో లక్ష్మణా అంటూ.. కన్నీరు పెడుతున్నారు. వీరి విషయంలో వాస్తవాలు తెలుసుకుని.. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మంత్రి పొంగులేటి.. దీనిని వదిలేసి.. వారిపై `పెయిడ్ ఆర్టిస్టులు` అనే ముద్ర వేయడం గమనార్హం. “వారంతా పెయిడ్ ఆర్టిస్టులు“ అని పొంగులేటి ముక్తాయించారు.
ఈ తరహా పరిస్థితి.. గతంలో ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల్లో కనిపించింది. అప్పట్లో రైతులు రాజధాని పరిరక్షణ కోసం.. ఉద్యమించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే.. నాడు రైతులు చేసిన ఉద్యమాలను. వారు చేపట్టిన నిరసనలను కూడా.. వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. “వారంతా పెయి డ్ ఆర్టిస్టులు“ అంటూ.. మంత్రుల నుంచి నాయకుల వరకు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు సేమ్ టు సేమ్.. పొంగులేటి కూడా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి పొంగులేటి సొంత జిల్లా ఖమ్మంలోని 62 ఎకరాల ప్రైవేట్ భూమిని భూదాన్ ట్రస్ట్కు గతంలో కొందరు విరాళంగా ఇచ్చారు. 2014లో ఈ ట్రస్ట్ బోర్డు నుంచి కొంత భూమిని సుమారు 2 వేల మందికి రెండు సెంట్ల చొప్పున భూములు ఇచ్చారు. దీంతో ఇక్కడి వారు ఇళ్లు కూడా కట్టుకున్నారు. కానీ, తాజాగా ఆ ఇళ్లకు పట్టాలు లేవని.. ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా లేవని పేర్కొంటూ.. కూలగొట్టారు.
ఈ వ్యవహారం.. తీవ్ర వివాదానికి దారితీసింది. బాధిత కుటుంబాల వారు.. రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. వీరికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్లో స్పందిస్తూ.. వారంతా పెయిడ్ ఆర్టిస్టులని.. వారికి భూములు ఎవరు ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. “కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులను వెనుకేసుకుని.. రాజకీయం చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారు“ అంటూ.. పొంగులేటి అన్నారు. కానీ, ఆయన తన సొంత జిల్లాకు చెందిన పేదలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సరికాదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 28, 2026 7:07 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…