Political News

వైసీపీ నేత‌ల‌ను గుర్తుచేసిన `పొంగులేటి`

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల‌ను గుర్తు చేస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక‌వైపు త‌మ ఇళ్లు కోల్పోయిన బాధితులు అలో ల‌క్ష్మ‌ణా అంటూ.. క‌న్నీరు పెడుతున్నారు. వీరి విష‌యంలో వాస్త‌వాలు తెలుసుకుని.. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మంత్రి పొంగులేటి.. దీనిని వ‌దిలేసి.. వారిపై `పెయిడ్ ఆర్టిస్టులు` అనే ముద్ర వేయ‌డం గ‌మ‌నార్హం. “వారంతా పెయిడ్ ఆర్టిస్టులు“ అని పొంగులేటి ముక్తాయించారు.

ఈ త‌ర‌హా పరిస్థితి.. గ‌తంలో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల్లో క‌నిపించింది. అప్ప‌ట్లో రైతులు రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ కోసం.. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌కు వ్యతిరేకంగా గ‌ళం విప్పారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. అయితే.. నాడు రైతులు చేసిన ఉద్య‌మాల‌ను. వారు చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌ను కూడా.. వైసీపీ నాయ‌కులు ఎద్దేవా చేశారు. “వారంతా పెయి డ్ ఆర్టిస్టులు“ అంటూ.. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ్యాఖ్యానించారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్‌.. పొంగులేటి కూడా అవే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మంత్రి పొంగులేటి సొంత జిల్లా ఖ‌మ్మంలోని 62 ఎకరాల ప్రైవేట్‌ భూమిని భూదాన్‌ ట్రస్ట్‌కు గ‌తంలో కొంద‌రు విరాళంగా ఇచ్చారు. 2014లో ఈ ట్రస్ట్‌ బోర్డు నుంచి కొంత భూమిని సుమారు 2 వేల మందికి రెండు సెంట్ల చొప్పున భూములు ఇచ్చారు. దీంతో ఇక్క‌డి వారు ఇళ్లు కూడా క‌ట్టుకున్నారు. కానీ, తాజాగా ఆ ఇళ్ల‌కు ప‌ట్టాలు లేవ‌ని.. ఇంటి నిర్మాణానికి అనుమ‌తులు కూడా లేవ‌ని పేర్కొంటూ.. కూల‌గొట్టారు.

ఈ వ్య‌వ‌హారం.. తీవ్ర వివాదానికి దారితీసింది. బాధిత కుటుంబాల వారు.. రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. వీరికి బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ నేప‌థ్యంలో మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌లో స్పందిస్తూ.. వారంతా పెయిడ్ ఆర్టిస్టుల‌ని.. వారికి భూములు ఎవరు ఇచ్చారో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు. “కొంత మంది పెయిడ్ ఆర్టిస్టుల‌ను వెనుకేసుకుని.. రాజ‌కీయం చేస్తున్న వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు“ అంటూ.. పొంగులేటి అన్నారు. కానీ, ఆయ‌న త‌న సొంత జిల్లాకు చెందిన పేద‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

3 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago