దర్శకుడు అనిల్ రావిపూడి అందరి అంచనాలకు ఝలక్ ఇస్తూ తన కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. హీరో వెంకటేష్ తో పాటు మరో కథానాయకుడు ఎవరనే సస్పెన్స్ గురించి గత కొన్ని రోజులుగా చాలా లీకులు వచ్చాయి. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్, కార్తీ పేర్లు బలంగా వినిపించాయి.
అయితే నిజంగా సంప్రదింపులు జరిగాయో లేక ఏదైనా కారణాల వల్ల వద్దనుకున్నారో ఏమో కానీ ఫైనల్ గా నందమూరి కళ్యాణ్ రామ్ లాక్ కావడం ఎవరూ అనుకోని కొత్త ట్విస్టు. అనిల్ రావిపూడిని నమ్మి పటాస్ రూపంలో తొలి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామే. డెబ్యూతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది ఈ కాంబో.
తర్వాత ఈ కలయిక మళ్ళీ సాధ్యపడలేదు. పటాస్ 2 కోసం అప్పుడప్పుడు అభిమానులు డిమాండ్ చేస్తున్నా అప్పటికే అనిల్ రావిపూడి పూర్తిగా ఫన్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేతులు కలపడం విశేషమే. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఆన్ స్క్రీన్ కాంబో డిఫరెంట్ గా ఉండబోతోందనేది అర్థమవుతోంది.
ఎక్కువ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కళ్యాణ్ రామ్ కామెడీ కూడా పండించగలడని కొన్ని శాంపిల్స్ పటాస్ లో చూపించాడు అనిల్ రావిపూడి. తర్వాత ఈ యాంగిల్ ఇతర దర్శకులు వాడుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు తిరిగి ఇంకో ఛాన్స్ వచ్చేసింది.
అనుకున్నట్టే 2027 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా ప్రకటించారు. ఒక్కసారి అనౌన్స్ చేశాక ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ కాకుండా చూసుకోవడం అనిల్ రావిపూడికు మాత్రమే సాధ్యమైన విద్య. సో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. దీనికి చాలా పొడవైన టైటిల్ లాక్ చేశారని తెలిసింది.
ఇప్పటికిప్పుడు దీన్ని ప్రకటించకపోవచ్చు కానీ సరైన సందర్భం చూసి రివీల్ చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వచ్చినా లీకుల ప్రకారం ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరిదిగా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు ప్లస్ భార్యల మధ్య కామెడీ ప్రధాన హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.
This post was last modified on February 26, 2026 7:40 pm
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…