ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు అత్యంత మంచి పాత మిత్రుడు (గ్రేట్ ఓల్డ్ ఫ్రెండ్) అని తెలిపారు. అమరావతి పర్యటనకు వచ్చిన గేట్స్.. సోమవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి వర్గ బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. చంద్రబాబు పట్టుబట్టి ఉండకపోతే.. నాడు హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్ వచ్చి ఉండేది కాదన్నారు.
ఇక, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆదర్శంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న సంజీవని కార్యక్రమానికి తాము సహకరిస్తామన్నారు. ఇదే సమయంలో ఐటీ రంగంలో విప్లవం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా తాము ప్రోత్సహిస్తామన్నారు. గేట్స్ ఫౌండేషన్ తరపున ఏ సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
స్వర్ణాంధ్ర సాకారానికి గేట్స్ 10 సూత్రాలు ఇవీ..
ఆరోగ్యం: సంజీవని వంటి కార్యక్రమానికి ప్రోత్సాహం.
విద్య: పాఠశాల విద్యకు నిధుల సహకారం.
ఐటీ: సాంకేతిక రంగంలో ఏపీ సర్కారుకు అన్ని విధాలా సహకారం.
డేటా: డేటా కేంద్రాల స్థాపన ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు.
డిజిటల్ పాలన: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ పాలనను మరింత పెంచడం.
డ్రోన్స్: డ్రోన్స్ ఉత్పత్తి, తయారీ రంగంలో సహకారం.
సాగు: సాగులో సాంకేతికతను మరింత విస్తరించేందుకు గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులు.
వాతావరణ మార్పులు: వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును అభివృద్ధి చేయడం.
ప్రకృతి విపత్తులు: ప్రకృతి విపత్తులను గుర్తించే వ్యవస్థకు సహకారం.
టెక్నాలజీ: అధునాతన టెక్నాలజీలో గేట్స్ సహకారం.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…