ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు అత్యంత మంచి పాత మిత్రుడు (గ్రేట్ ఓల్డ్ ఫ్రెండ్) అని తెలిపారు. అమరావతి పర్యటనకు వచ్చిన గేట్స్.. సోమవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి వర్గ బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. చంద్రబాబు పట్టుబట్టి ఉండకపోతే.. నాడు హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్ వచ్చి ఉండేది కాదన్నారు.
ఇక, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆదర్శంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న సంజీవని కార్యక్రమానికి తాము సహకరిస్తామన్నారు. ఇదే సమయంలో ఐటీ రంగంలో విప్లవం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా తాము ప్రోత్సహిస్తామన్నారు. గేట్స్ ఫౌండేషన్ తరపున ఏ సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
స్వర్ణాంధ్ర సాకారానికి గేట్స్ 10 సూత్రాలు ఇవీ..
ఆరోగ్యం: సంజీవని వంటి కార్యక్రమానికి ప్రోత్సాహం.
విద్య: పాఠశాల విద్యకు నిధుల సహకారం.
ఐటీ: సాంకేతిక రంగంలో ఏపీ సర్కారుకు అన్ని విధాలా సహకారం.
డేటా: డేటా కేంద్రాల స్థాపన ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు.
డిజిటల్ పాలన: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ పాలనను మరింత పెంచడం.
డ్రోన్స్: డ్రోన్స్ ఉత్పత్తి, తయారీ రంగంలో సహకారం.
సాగు: సాగులో సాంకేతికతను మరింత విస్తరించేందుకు గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులు.
వాతావరణ మార్పులు: వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును అభివృద్ధి చేయడం.
ప్రకృతి విపత్తులు: ప్రకృతి విపత్తులను గుర్తించే వ్యవస్థకు సహకారం.
టెక్నాలజీ: అధునాతన టెక్నాలజీలో గేట్స్ సహకారం.
This post was last modified on February 17, 2026 12:18 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…
తమిళ సీనియర్ నటి త్రిష.. ఎన్నో ఏళ్ల ముందే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వరుణ్ మణియన్ అనే నిర్మాతతో నిశ్చితార్థం…