పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన కనిపించడం లేదు. కథలో వైవిధ్యం ఉన్నా ట్రీట్ మెంట్ లో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్న వైనం వసూళ్లలో బయట పడుతోంది.
నిజానికి దీనికి ముందు అనుకున్న హీరో విశ్వక్ సేన్ అన్న సంగతి తెలిసిందే. దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ తో ఏవో విభేదాలు రావడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. మీడియా ముందు చిన్నపాటి అల్లరి కూడా అయ్యింది. కొంత గ్యాప్ తీసుకుని అర్జున్ హీరోని మార్చుకుని తాను అనుకున్నట్టే సీత పయనం పూర్తి చేశాడు.
కట్ చేస్తే సీత పయనం రిజల్ట్ చూశాక విశ్వక్ సేన్ ఒక ఫ్లాప్ తప్పించుకున్నాడని ఫ్యాన్స్ ఊరట చెందవచ్చు కానీ ఆ ఆనందం ఫంకీ ఆవిరి చేసింది. ఎందుకంటే ఏడాదికి పైగా విశ్వక్ ఈ ఒక్క సినిమా మీదే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడు అనుదీప్ తనలో ఫన్ యాంగిల్ బయటికి తీసి బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో బయట కూడా కనిపించకుండా దానికే అంకితమైపోయాడు.
తీరా చూస్తే ఫంకీ కూడా సీత పయనం లాగా ఎదురీదుతోంది. ఒక వివాదం వల్ల విడిపోయిన అర్జున్, విశ్వక్ సేన్ పరస్పరం బాక్సాఫీస్ దగ్గర తలపడితే ఎవరూ విజేత కాకపోవడం ఫైనల్ ట్విస్ట్. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ దొరికిపోయారు.
ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని అనుకోవడానికి లేదు. అది కేవలం ఒక సమర్ధింపు కోసం చెప్పుకునే సాకు మాత్రమే. అన్ని వర్గాలను మెప్పిస్తే జనం ఆదరిస్తారని గతంలో ఎన్నోసార్లు రుజువయ్యింది. కాకపోతే విశ్వక్ సేన్, అర్జున్ లో ఎవరికో ఒకరికి సూపర్ హిట్ దక్కి ఉంటే బాగుండేది కానీ అలా జరగకపోవడం నిరాశ కలిగించే విషయమే.
రాబోయే వీకెండ్ ఏమైనా పికప్ చూపిస్తే వసూళ్ల పరంగా కొంచెం నెంబర్లు చూడొచ్చు కానీ ఇప్పటికైతే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ విశ్వక్ కనక సీత పయనం చేసి ఉంటే ఓపెనింగ్స్ పరంగా కొంచెం హెల్ప్ అయ్యేది కానీ అలా జరగకపోవడం బ్యాడ్ లక్కే.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…