తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ముందుగా ఏం జరిగిందో తెలుసుకుంటే మ్యాటర్ స్పష్టంగా అర్థమవుతుంది.
ఇండియన్ టాప్ మ్యూజిక్ కంపెనీలలో ఒకటైన సరిగమ సంస్థ వద్ద ఇళయరాజా కంపోజ్ చేసిన 134 సినిమాల ఆడియో హక్కులున్నాయి. 1976 నుంచి 2001 మధ్యలో విడుదలైన వీటి నిర్మాతల దగ్గర నుంచి సరిగమ కోరినంత మొత్తాన్ని చెల్లించి శాశ్వతంగా రైట్స్ కొనుగోలు చేసింది. ఈ నెల ప్రారంభంలో రాజా ఈ పాటలను ఐట్యూన్స్, జియో సావన్, ప్రైమ్ మ్యూజిక్ తదితర ప్లాట్ ఫార్మ్స్ లో అప్లోడ్ అనుమతులిచ్చారు.
దీంతో తమకు హక్కులు ఉన్న సినిమా పాటలను ఇళయరాజా సదరు సంస్థలకు ఇచ్చారని సరిగమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1957 కాపీ రైట్ చట్టం ప్రకారం ఏదైనా నిర్దిష్టమైన ఒప్పందం లేకపోతే మ్యూజిక్ కు సంబంధించిన హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఆయన ఎవరికి అమ్మితే వాళ్ళు సొంతదారులవుతారు. ఆ విధంగా సరిగమ వాటికి ఓనర్ అయ్యింది.
ఎన్ ఇనియ పొన్ నిలవే అనే చార్ట్ బస్టర్ సాంగ్ కు సంబంధించిన వివాదంతో ఇళయరాజా, సరిగమ మధ్య గొడవ మొదలయ్యింది. తాజాగా జస్టిస్ తుషార్ రావుగెడేలా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇళయరాజా సరిగమ దగ్గర ఉన్న పాటలను వాడుకోవడానికి ఉండదు.
దీని మీద లీగల్ గా ఇళయరాజా మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి కానీ ప్రస్తుతానికి మాత్రం స్ట్రోక్ తగిలిందనే చెప్పాలి. అయినా ఒక పాట కంపోజ్ చేసి నిర్మాతకు ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాక ఆటోమేటిక్ గా దాని హక్కులు ప్రొడ్యూసర్ కే దక్కుతాయి. కాపీ రైట్ చట్టం చెబుతోంది ఇదే.
అయితే ఇదే లాలో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా కొందరు సంగీత దర్శకులు, గాయకులు, గీత రచయితలు అప్పుడప్పుడు పోరాడుతూ ఉంటారు. ఒక్క ఇళయరాజా మాత్రమే దీని సీరియస్ గా తీసుకుని చాలా దూరం తీసుకెళ్లారు. మన శంకరవరప్రసాద్ గారు కోసం అడగ్గానే ఉచితంగా అనుమతి ఇచ్చారని ఇటీవలే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 16, 2026 10:21 pm
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…