తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది.
నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు దక్కనివ్వమని నొక్కి చెప్పారు.
“సీపీఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం.. కావాలంటే మేయర్ పీఠం వారికే. కేవలం ఆ రెండు పార్టీలను రాకుండా చూడాలని, సింగరేణి స్కాముల గురించి తాము ఎంత పోరాడుతున్నా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని, సింగరేణి కోసం తాము కలవాలని” కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనితో ఎలాగో మేయర్ పీఠం వారిదే కాబట్టి బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులు చేతులు కలుపుతారని భావించారంతా.
ఇవాళ అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేరు సగం కాలం పాటు పంచుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
‘సింగరేణి స్కాం’ అంటూ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలన్న బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద అడ్డుకట్టలా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on February 14, 2026 11:10 pm
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…
ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…
దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…