తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది.
నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు దక్కనివ్వమని నొక్కి చెప్పారు.
“సీపీఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం.. కావాలంటే మేయర్ పీఠం వారికే. కేవలం ఆ రెండు పార్టీలను రాకుండా చూడాలని, సింగరేణి స్కాముల గురించి తాము ఎంత పోరాడుతున్నా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని, సింగరేణి కోసం తాము కలవాలని” కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనితో ఎలాగో మేయర్ పీఠం వారిదే కాబట్టి బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులు చేతులు కలుపుతారని భావించారంతా.
ఇవాళ అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేరు సగం కాలం పాటు పంచుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
‘సింగరేణి స్కాం’ అంటూ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలన్న బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద అడ్డుకట్టలా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on February 14, 2026 11:10 pm
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…