Political News

బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!

తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది.

నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు దక్కనివ్వమని నొక్కి చెప్పారు.

“సీపీఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం.. కావాలంటే మేయర్ పీఠం వారికే. కేవలం ఆ రెండు పార్టీలను రాకుండా చూడాలని, సింగరేణి స్కాముల గురించి తాము ఎంత పోరాడుతున్నా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని, సింగరేణి కోసం తాము కలవాలని” కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనితో ఎలాగో మేయర్ పీఠం వారిదే కాబట్టి బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులు చేతులు కలుపుతారని భావించారంతా.

ఇవాళ అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేరు సగం కాలం పాటు పంచుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

‘సింగరేణి స్కాం’ అంటూ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలన్న బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద అడ్డుకట్టలా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

This post was last modified on February 14, 2026 11:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

శత్రుదేశం మాఫియాలో ‘దురంధర్’ ప్రతీకారం

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది…

1 hour ago

కాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందా

హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్…

2 hours ago

ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!

“భార‌త దేశం స‌ర్వ‌స‌త్తాక సార్వ‌భౌమ దేశం. ఇత‌ర దేశాల‌కు త‌ల‌వొంచ‌దు. ఎవ‌రో చెప్పిన‌ట్టు కూడా న‌డుచుకోదు. ఎవ‌రి ఆదేశాల‌నో పాటించాల్సిన…

3 hours ago

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం…

3 hours ago

వార్ ఎఫెక్ట్… వంటింట్లో బాదుడే బాదుడు

యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు…

4 hours ago

2029 ఆయుధాలు రెడీ చేసుకుంటోన్న టీడీపీ – వైసీపీ…!

2029లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్ప‌టి నుంచే ఆయుధాల‌ను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి ప‌దును కూడాపెంచుకుంటున్నాయా?…

5 hours ago