తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది.
నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు దక్కనివ్వమని నొక్కి చెప్పారు.
“సీపీఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం.. కావాలంటే మేయర్ పీఠం వారికే. కేవలం ఆ రెండు పార్టీలను రాకుండా చూడాలని, సింగరేణి స్కాముల గురించి తాము ఎంత పోరాడుతున్నా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని, సింగరేణి కోసం తాము కలవాలని” కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనితో ఎలాగో మేయర్ పీఠం వారిదే కాబట్టి బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులు చేతులు కలుపుతారని భావించారంతా.
ఇవాళ అనూహ్యంగా సీపీఐ అధికార పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేరు సగం కాలం పాటు పంచుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
‘సింగరేణి స్కాం’ అంటూ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలన్న బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద అడ్డుకట్టలా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…