తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరికి జాతిపితవురా నువ్వు అంటూ కేసీఆర్ పై రేవంత్ చేసిన షాకింగ్ కామెంట్లు కాక రేపాయి. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ నా…అంటూ బూతులు తిడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మరో రెండు రోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ రోడ్ షో సందర్భంగా కాంగ్రెస్ నేతలతోపాటు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. మీరేమీ పీకలేరు…మీ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయలేడు అంటూ విమర్శించారు.
అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకూడదని రేవంత్ రెడ్డి అందరు దేవుళ్లకు మొక్కుకోవాలని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరగానే పొట్టోడికి రేవంత్ ను ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ను పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నవురా అంటూ ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి…చంద్రబాబు కోసం సంచులు మోస్తున్నాడని ఎద్దేవా చేశారు.
సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్…అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. వెనకటి రోజులు తెస్తానని రేవంత్ ముందే చెప్పాడని, అందుకే యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడే వెనుకటి రోజులు వచ్చాయని విమర్శించారు. ఒక్కసారి ఈ కాంగ్రెస్ వాళ్ల మాటలు విని అవకాశమిస్తే ఏం జరిగిందో ప్రజలకు అర్థమైందని అన్నారు. మరి, కేటీఆర్ కామెంట్లకు రేవంత్ ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.
This post was last modified on February 9, 2026 12:16 pm
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…