వైసీపీ నేత అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక, అంబటి క్షమాపణలు చెప్పాలంటూ.. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన అంబటి కుమార్తె మౌనిక.. ఇటు సర్కారు, అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు మౌనిక రాజకీయ ఎంట్రీ ఉంటుందా? అనేది ప్రశ్నగా మారింది. పలువురు కాపు నాయకులు కూడా మౌనిక దూకుడును ప్రశంసిస్తున్నారు. వాస్తవానికి గతంలోనూ అనేక మంది వారసురాళ్లు తమ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తినప్పుడు మీడియా ముందుకు వచ్చారు. భూమా నాగిరెడ్డి కుమార్తెల్లో రెండో కుమార్తె.. మౌనిక కూడా ఇలానే దూకుడు ప్రదర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో 2015-17 మధ్య ఆమె ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేశారు.
దీంతో ఆమెపై కూడా ఇలాంటి చర్చే జరిగింది. కానీ, మౌనిక రాజకీయ అరంగేట్రం చేయలేదు. నిజానికి అక్క భూమా అఖిల ప్రియ కంటే కూడా మౌనికకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. అయినప్పటికీ.. ఆమె పొలిటికల్గా దూకుడు ప్రదర్శించలేదు. ఇప్పుడు అంబటి కుటుంబం నుంచి మౌనిక వస్తున్నారా? అంటే.. వైసీపీ నాయకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. కానీ, ఈ విషయంలో ఆమె ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు.
కులం ఒక్కటే సరిపోతుందా.. ?
ప్రస్తుతం అంబటి కుమార్తెకు ఉన్న ఏకైక ట్యాగ్ కులం మాత్రమే. దీనిని ఆధారంగా చేసుకునే ఆమె వ్యాఖ్యలు చేశారు. అంత మాత్రాన కాపులు మొత్తంగా ఆమెకు మద్దతు పలుకుతారా? అనేది ప్రధాన చర్చ. ఇక్కడే ఓ కీలక విషయం చర్చించాలి.
ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి కూడా ఫైర్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కానీ, రాజకీయంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు.. కాపు సామాజిక వర్గంలో పెద్దగా చర్చకు రావడం లేదు. అయితే.. జనసేన గూటిలో ఉన్నారు కాబట్టి.. ఆమెకు అదే రక్షణగా ఉంది. మరి మౌనిక వ్యవహారంఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది చూడాలి.
This post was last modified on February 9, 2026 2:55 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…