మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. సిట్ నివేదికను వైసీపీ తప్పుదారి పట్టిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ నిర్వహించారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.
ప్రతి సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనలోనే దాచుకొని “కర్మ చూసుకుంటుంది” అని అనుకుని మౌనంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ఈ విధానం ఖచ్చితంగా మారాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మన సహనాన్ని బలహీనంగా చూపిస్తుందని పేర్కొన్నారు. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలని పవన్ ట్వీట్ చేశారు.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని, కేవలం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవడమే అని ఆయన స్పష్టం చేశారు.
This post was last modified on February 6, 2026 6:56 pm
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…