మార్చి 19 విడుదల కాబోతున్న యష్ టాక్సిక్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అదే రోజు దురంధర్ 2 ది రివెంజ్ వస్తున్నా సరే వెనక్కు తగ్గకుండా పోటీకి సిద్ధ పడిన వైనం గురించి ట్రేడ్ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. వన్ అఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్ గా దీని గురించి చెప్పుకుంటున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను 120 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని అధికారికంగా ఎస్విసి ధృవీకరించలేదు. కానీ సమాచారమైతే చక్కర్లు కొడుతోంది. ఎంత అడ్వాన్ బేసిస్ మీదే అయినా ఎంతో కొంత రిస్క్ పొంచి ఉన్న మాట వాస్తవం.
టాక్సిక్ మీద కెవిఎన్ సంస్థ భారీ బడ్జెట్ పెట్టింది. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉంది. చాలా వాయిదాలే పడ్డాయి. కెజిఎఫ్ తర్వాత మూవీ కావడంతో యష్ ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు కమర్షియల్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో యష్ చాలా పెద్ద రిస్కు తీసుకున్నాడు.
టీజర్ మంచి కాంట్రవర్సినే తీసుకొచ్చిన నేపథ్యంలో అందరి చూపులు ట్రైలర్ మీద ఉన్నాయి. ఒకవేళ అది కనక అంచనాలకు తగ్గట్టు ఉంటే మతిపోయే నెంబర్లతో బిజినెస్ జరగడం ఖాయం. మళ్ళీ అసలు టాపిక్ కు వద్దాం.
ఏపీ తెలంగాణ మీద నూటా ఇరవై కోట్ల రికవరి రావడం అంత ఈజీ కాదు. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. అసలే దురంధర్ 2 రివెంజ్ తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈసారి థియేటర్ కౌంట్ పెద్దఎత్తున ఉండబోతోంది. దానికి ధీటుగా ఉండాలంటే టాక్సిక్ అంతకు మించి అనిపించే రెస్పాన్స్ తెచ్చుకోవాలి.
దిల్ రాజు నెట్ వర్క్ లో స్క్రీన్ల పరంగా ఇబ్బందులు ఉండవు కాబట్టి మిగిలింది అంచనాలు అందుకోవడమే. ఇంకో రిస్క్ లేకపోలేదు. సరిగ్గా వారం రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. అది పాజిటివ్ గా ఉంటే టాక్సిక్ మీద ప్రభావం చూపించే అవకాశాన్ని కొట్టి పారేయలేం.
This post was last modified on February 6, 2026 7:11 pm
మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్…
ఏపీలో తెర మీదకు వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం మరింత ముదురుతోంది. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి?…
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ అనిల్ రావిపూడి పదో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే జోరుగా జరుగుతోంది.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పరామర్శ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించేందుకు…
2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకుంటూ కేవలం 80…