తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఉందని వైసీపీ వాదిస్తోంది. అయితే, ఆ వాదనలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ల కామెంట్లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని జగన్ ఆరోపించారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4 నెయ్యి ట్యాంకర్లను టీటీడీ రిజెక్ట్ చేసిందని, ఆ ట్యాంకర్లు మళ్లీ దొడ్డిదారిన తిరుపతికి వచ్చాయని ఆరోపించారు.
ఆ ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని లడ్డూలో వాడారని, ఇదే విషయాన్ని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొందని జగన్ అన్నారు. చంద్రబాబు చేసిన అన్యాయన్నే సీబీఐ చార్జ్ షీట్ లో పొందుపరిచిందని తెలిపారు. లడ్డూ ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వులు, చేప నూనె కలిశాయని దుష్ప్రచారం చేశారని, రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని సీబీఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉందని, నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ స్పష్టం చేసిందని జగన్ చెప్పారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు.
వేంకటేశ్వర స్వామిని చంద్రబాబు అగౌరవపరిచారని, ప్రసాద ప్రతిష్ఠను దిగజార్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నించిన వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని ఫైర్ అయ్యారు.
సీబీఐ చార్జిషీట్ లో ఎవరు పాపం చేశారో స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఎవరిది తప్పో చంద్రబాబు, లోకేశ్, పవన్ లు చెప్పాలని జగన్ ప్రశ్నించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ చెప్పలేదని, తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు,పవన్, లోకేశ్ లు చెప్పారని అన్నారు.
వాళ్లకు డంకా బజాయిస్తున్న కొన్ని మీడియా సంస్థలు అదే విషయంపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. ఇంతకన్నా హేయమైన పని ఎక్కడా ఉండదని అన్నారు. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుండా ఇంకా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on February 6, 2026 6:36 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…