తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఉందని వైసీపీ వాదిస్తోంది. అయితే, ఆ వాదనలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ల కామెంట్లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని జగన్ ఆరోపించారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4 నెయ్యి ట్యాంకర్లను టీటీడీ రిజెక్ట్ చేసిందని, ఆ ట్యాంకర్లు మళ్లీ దొడ్డిదారిన తిరుపతికి వచ్చాయని ఆరోపించారు.
ఆ ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని లడ్డూలో వాడారని, ఇదే విషయాన్ని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొందని జగన్ అన్నారు. చంద్రబాబు చేసిన అన్యాయన్నే సీబీఐ చార్జ్ షీట్ లో పొందుపరిచిందని తెలిపారు. లడ్డూ ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వులు, చేప నూనె కలిశాయని దుష్ప్రచారం చేశారని, రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని సీబీఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉందని, నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ స్పష్టం చేసిందని జగన్ చెప్పారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు.
వేంకటేశ్వర స్వామిని చంద్రబాబు అగౌరవపరిచారని, ప్రసాద ప్రతిష్ఠను దిగజార్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నించిన వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని ఫైర్ అయ్యారు.
సీబీఐ చార్జిషీట్ లో ఎవరు పాపం చేశారో స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఎవరిది తప్పో చంద్రబాబు, లోకేశ్, పవన్ లు చెప్పాలని జగన్ ప్రశ్నించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ చెప్పలేదని, తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు,పవన్, లోకేశ్ లు చెప్పారని అన్నారు.
వాళ్లకు డంకా బజాయిస్తున్న కొన్ని మీడియా సంస్థలు అదే విషయంపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. ఇంతకన్నా హేయమైన పని ఎక్కడా ఉండదని అన్నారు. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుండా ఇంకా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on February 6, 2026 6:36 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…