Political News

చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి వాడారు: జగన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఉందని వైసీపీ వాదిస్తోంది. అయితే, ఆ వాదనలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ల కామెంట్లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.

సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని జగన్‌ ఆరోపించారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4 నెయ్యి ట్యాంకర్లను టీటీడీ రిజెక్ట్ చేసిందని, ఆ ట్యాంకర్లు మళ్లీ దొడ్డిదారిన తిరుపతికి వచ్చాయని ఆరోపించారు.

ఆ ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని లడ్డూలో వాడారని, ఇదే విషయాన్ని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొందని జగన్ అన్నారు. చంద్రబాబు చేసిన అన్యాయన్నే సీబీఐ చార్జ్ షీట్ లో పొందుపరిచిందని తెలిపారు. లడ్డూ ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వులు, చేప నూనె కలిశాయని దుష్ప్రచారం చేశారని, రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని సీబీఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉందని, నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ స్పష్టం చేసిందని జగన్ చెప్పారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు.

వేంకటేశ్వర స్వామిని చంద్రబాబు అగౌరవపరిచారని, ప్రసాద ప్రతిష్ఠను దిగజార్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నించిన వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని ఫైర్ అయ్యారు.

సీబీఐ చార్జిషీట్ లో ఎవరు పాపం చేశారో స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఎవరిది తప్పో చంద్రబాబు, లోకేశ్, పవన్ లు చెప్పాలని జగన్ ప్రశ్నించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ చెప్పలేదని, తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు,పవన్, లోకేశ్ లు చెప్పారని అన్నారు.

వాళ్లకు డంకా బజాయిస్తున్న కొన్ని మీడియా సంస్థలు అదే విషయంపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. ఇంతకన్నా హేయమైన పని ఎక్కడా ఉండదని అన్నారు. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుండా ఇంకా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on February 6, 2026 6:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హమ్మయ్య… ఎట్టకేలకు దొరికిన పెద్దపులి

తూర్పు గోదావరి ప్రజలకు వారం నుండి కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులిని అధికారులు కొద్దిసేపటి క్రితమే మత్తు…

30 minutes ago

టీటీడీకి కొత్త ఈవో.. సవాళ్ల స్వాగతమేనా?!

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.…

36 minutes ago

బీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దని కవిత పిలుపు

బీఆర్ ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం…

37 minutes ago

టాక్సిక్ నెంబర్లు నమ్మొచ్చంటారా

మార్చి 19 విడుదల కాబోతున్న యష్ టాక్సిక్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అదే రోజు దురంధర్ 2 ది…

1 hour ago

కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్

మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు…

1 hour ago

ఏపీలో ఎన్నాళ్లీ లడ్డూ రాజకీయం..!

ఏపీలో తెర మీదకు వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం మరింత ముదురుతోంది. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి?…

2 hours ago