Political News

ఏపీలో ఎన్నాళ్లీ లడ్డూ రాజకీయం..!

ఏపీలో తెర మీదకు వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం మరింత ముదురుతోంది. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి? ఎంత వరకు కొనసాగుతాయి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చింది. 2024 జూన్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్‌లో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

అప్పట్లో సీఎం చంద్రబాబే స్వయంగా లడ్డూ వ్యవహారంపై వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి ప్రారంభమైన విచారణ ఏడాది పాటు కొనసాగింది. గత నెలలో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సమర్పించింది. అదే సమయంలో చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగాల్సి ఉంది.

ఇంతలోనే లడ్డూపై రాజకీయం మరింత వేడెక్కింది. రెండోసారి ఈ వివాదాన్ని వైసీపీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీబీఐ నివేదికలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు స్పందించారు. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా నివేదికలో లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహించి నిరసనలు తెలిపారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాలతో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం దాడులు, అరెస్టులు, జైలు వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వం మరోసారి కమిషన్ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సిట్ అధికారులు తేల్చని అంశాలను మళ్లీ పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కోర్టులో ఉన్న సిట్ నివేదికపై విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వం కొత్త కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. అన్ని కోణాల్లో పరిశీలిస్తే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం వచ్చే ఎన్నికల వరకు కొనసాగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on February 6, 2026 6:34 pm

Share
Show comments
Published by
Satya
Tags: AP

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

9 minutes ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

1 hour ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

2 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago