Political News

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మీడియా ముందుకు వచ్చిన ఆమె మరిన్ని ఆరోపణలు చేశారు.

ఫేస్ బుక్ లో తనతో పరిచయమైన రోజే మూడు గంటలకు మాట్లాడిన శ్రీధర్…ఆ తర్వాత నంబర్ తీసుకొని టచ్ లో ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఒక రోజు కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు.

ఉదయం షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని ఆమె చెప్పారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లానని చెప్పుకొచ్చారు.

తన భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ ప్రామిస్ చేశారని, అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నానని వెల్లడించారు. ఆయన ఐ లవ్ యూ చెప్పిన తర్వాత తాను కూడా చెప్పానని అన్నారు.

అయితే, ఈ ప్రెస్ మీట్ తర్వాత బాధితురాలిని అని చెప్పుకుంటున్న మహిళకు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ ఇన్నాళ్లూ ఉన్నారని, ఏదో విషయంలో తేడా రావడంతో ఈ రకంగా శ్రీధర్ ది మాత్రమే తప్పు అని నిందిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, 15 నెలల వ్యవధిలో 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం వైద్యపరంగా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.

ఇక, శ్రీధర్ ను సదరు మహిళ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపణలు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారని, అయితే, తానే శ్రీధర్ కు 7 లక్షలు డబ్బులిచ్చానని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లూ సైలెంట్ గా శ్రీధర్ తో ఇష్టపూర్వకంగా ఉండి…ఇప్పుడు మాత్రం ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతున్న ఆ మహిళను కొందరు విమర్శిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయింది అని కొందరు అంటున్నారు.

This post was last modified on January 28, 2026 10:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

32 minutes ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

2 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

2 hours ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

3 hours ago

“అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలే“

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌స్తుతం…

4 hours ago

దిల్ రాజు భలే తప్పించుకున్నారే…

తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…

4 hours ago