Political News

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మీడియా ముందుకు వచ్చిన ఆమె మరిన్ని ఆరోపణలు చేశారు.

ఫేస్ బుక్ లో తనతో పరిచయమైన రోజే మూడు గంటలకు మాట్లాడిన శ్రీధర్…ఆ తర్వాత నంబర్ తీసుకొని టచ్ లో ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఒక రోజు కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు.

ఉదయం షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని ఆమె చెప్పారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లానని చెప్పుకొచ్చారు.

తన భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ ప్రామిస్ చేశారని, అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నానని వెల్లడించారు. ఆయన ఐ లవ్ యూ చెప్పిన తర్వాత తాను కూడా చెప్పానని అన్నారు.

అయితే, ఈ ప్రెస్ మీట్ తర్వాత బాధితురాలిని అని చెప్పుకుంటున్న మహిళకు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ ఇన్నాళ్లూ ఉన్నారని, ఏదో విషయంలో తేడా రావడంతో ఈ రకంగా శ్రీధర్ ది మాత్రమే తప్పు అని నిందిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, 15 నెలల వ్యవధిలో 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం వైద్యపరంగా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.

ఇక, శ్రీధర్ ను సదరు మహిళ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపణలు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారని, అయితే, తానే శ్రీధర్ కు 7 లక్షలు డబ్బులిచ్చానని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లూ సైలెంట్ గా శ్రీధర్ తో ఇష్టపూర్వకంగా ఉండి…ఇప్పుడు మాత్రం ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతున్న ఆ మహిళను కొందరు విమర్శిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయింది అని కొందరు అంటున్నారు.

This post was last modified on January 28, 2026 10:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

25 minutes ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

37 minutes ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

1 hour ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

2 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

2 hours ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

5 hours ago