జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మీడియా ముందుకు వచ్చిన ఆమె మరిన్ని ఆరోపణలు చేశారు.
ఫేస్ బుక్ లో తనతో పరిచయమైన రోజే మూడు గంటలకు మాట్లాడిన శ్రీధర్…ఆ తర్వాత నంబర్ తీసుకొని టచ్ లో ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఒక రోజు కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు.
ఉదయం షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని ఆమె చెప్పారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లానని చెప్పుకొచ్చారు.
తన భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ ప్రామిస్ చేశారని, అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నానని వెల్లడించారు. ఆయన ఐ లవ్ యూ చెప్పిన తర్వాత తాను కూడా చెప్పానని అన్నారు.
అయితే, ఈ ప్రెస్ మీట్ తర్వాత బాధితురాలిని అని చెప్పుకుంటున్న మహిళకు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ ఇన్నాళ్లూ ఉన్నారని, ఏదో విషయంలో తేడా రావడంతో ఈ రకంగా శ్రీధర్ ది మాత్రమే తప్పు అని నిందిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, 15 నెలల వ్యవధిలో 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం వైద్యపరంగా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.
ఇక, శ్రీధర్ ను సదరు మహిళ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపణలు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారని, అయితే, తానే శ్రీధర్ కు 7 లక్షలు డబ్బులిచ్చానని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్నాళ్లూ సైలెంట్ గా శ్రీధర్ తో ఇష్టపూర్వకంగా ఉండి…ఇప్పుడు మాత్రం ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతున్న ఆ మహిళను కొందరు విమర్శిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయింది అని కొందరు అంటున్నారు.
This post was last modified on January 28, 2026 10:11 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…