Political News

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మీడియా ముందుకు వచ్చిన ఆమె మరిన్ని ఆరోపణలు చేశారు.

ఫేస్ బుక్ లో తనతో పరిచయమైన రోజే మూడు గంటలకు మాట్లాడిన శ్రీధర్…ఆ తర్వాత నంబర్ తీసుకొని టచ్ లో ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఒక రోజు కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు.

ఉదయం షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని ఆమె చెప్పారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లానని చెప్పుకొచ్చారు.

తన భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ ప్రామిస్ చేశారని, అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నానని వెల్లడించారు. ఆయన ఐ లవ్ యూ చెప్పిన తర్వాత తాను కూడా చెప్పానని అన్నారు.

అయితే, ఈ ప్రెస్ మీట్ తర్వాత బాధితురాలిని అని చెప్పుకుంటున్న మహిళకు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ ఇన్నాళ్లూ ఉన్నారని, ఏదో విషయంలో తేడా రావడంతో ఈ రకంగా శ్రీధర్ ది మాత్రమే తప్పు అని నిందిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, 15 నెలల వ్యవధిలో 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం వైద్యపరంగా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.

ఇక, శ్రీధర్ ను సదరు మహిళ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపణలు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారని, అయితే, తానే శ్రీధర్ కు 7 లక్షలు డబ్బులిచ్చానని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లూ సైలెంట్ గా శ్రీధర్ తో ఇష్టపూర్వకంగా ఉండి…ఇప్పుడు మాత్రం ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతున్న ఆ మహిళను కొందరు విమర్శిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయింది అని కొందరు అంటున్నారు.

This post was last modified on January 28, 2026 10:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

52 minutes ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

3 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

4 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

4 hours ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

4 hours ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

5 hours ago