తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని వివరాలను త్వరలోనే బయట పెడుతున్నానన్నారు. ఈ కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఇస్తున్నారని చెప్పిన ఆయన, ఈ క్రమంలో అవినీతి దందాకు తెరదీశారని విమర్శించారు. ముఖ్య నేతకు, మంత్రులకు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో మైక్రో బ్రూవర్ల ఏర్పాటుకు మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 25 దరఖాస్తులకు అనుమతి లభించిందని హరీష్ రావు తెలిపారు. వీటిలో 21 ముఖ్య నేతకు చెందినవని, మరో నాలుగు మంత్రికి సంబంధించినవని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి ఇది మరో కోణమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయట పెట్టనున్నట్టు వెల్లడించారు. దీని వెనుక ఏం జరిగిందో కూడా తెలియజేయనున్నట్టు వివరించారు.
ఏంటి బ్రూవర్లు?
బ్రూవర్ అంటే బీరు వంటి వాటిని తయారు చేసే కంపెనీలు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే ఇటీవల కాలంలో మైక్రో బ్రూవర్ కల్చర్ పెరిగింది. అంటే బార్లలో అక్కడికక్కడే తయారు చేసి అందించే బీర్. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. గోవా తదితర పర్యాటక రాష్ట్రాల్లో మైక్రో బ్రూవరీలకు అనుమతి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నాయి.
This post was last modified on January 28, 2026 10:36 pm
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…