Political News

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని వివరాలను త్వరలోనే బయట పెడుతున్నానన్నారు. ఈ కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఇస్తున్నారని చెప్పిన ఆయన, ఈ క్రమంలో అవినీతి దందాకు తెరదీశారని విమర్శించారు. ముఖ్య నేతకు, మంత్రులకు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో మైక్రో బ్రూవర్ల ఏర్పాటుకు మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 25 దరఖాస్తులకు అనుమతి లభించిందని హరీష్ రావు తెలిపారు. వీటిలో 21 ముఖ్య నేతకు చెందినవని, మరో నాలుగు మంత్రికి సంబంధించినవని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి ఇది మరో కోణమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయట పెట్టనున్నట్టు వెల్లడించారు. దీని వెనుక ఏం జరిగిందో కూడా తెలియజేయనున్నట్టు వివరించారు.

ఏంటి బ్రూవర్లు?

బ్రూవర్ అంటే బీరు వంటి వాటిని తయారు చేసే కంపెనీలు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే ఇటీవల కాలంలో మైక్రో బ్రూవర్ కల్చర్ పెరిగింది. అంటే బార్లలో అక్కడికక్కడే తయారు చేసి అందించే బీర్. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. గోవా తదితర పర్యాటక రాష్ట్రాల్లో మైక్రో బ్రూవరీలకు అనుమతి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నాయి.

This post was last modified on January 28, 2026 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

2 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

4 hours ago

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…

4 hours ago

పైరసీని ఆపడానికి యాప్

సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…

5 hours ago

‘ఇంకో 3 ఏళ్లు కళ్లుమూసుకుంటే చాలు’

తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…

5 hours ago

ఒకే నేపథ్యంతో చిరంజీవి బాలకృష్ణ ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఒకే బ్యాక్…

7 hours ago