ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ సీఎం కాలేరు.. వైసీపీ అధికారంలోకి రాదు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గెలిచి చెప్పారు.. అందుకు కారణం కూడా ఆయన వివరించారు. కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.
లిక్కర్ స్కామ్ లో విచారణ అనంతరం ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ విజయసాయి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. తాను రాజీనామా చేసినప్పుడు నుంచి ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఆయన జగన్ కోటరీ పై నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటికి మొన్న అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి! .. అంటూ సంచలన ట్వీట్ చేసి చర్చకు తెరలేపారు.
ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి ఆ కోటరీ అడ్డు అంటూ మరోసారి సంచలన ప్రకటన చేశారు. తాను ఏ పార్టీలో చేరబోను అని చెబుతున్న విజయసాయి.. జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని తప్పిస్తే మళ్లీ వైసీపీలోకి వెళ్తారా..? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
మొత్తం మీద విజయసాయి తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో లాభాలన్నీ కోటరీ లో ఉన్నవారికి, కేసులు మాత్రం తన పైకి అని ఆయన ఈరోజు విలేకరుల సమావేశంలో చెప్పటం ఆయనలో ఉన్న బాధకు అర్థం పడుతుంది.
జగన్ నమ్మిన బంటుగా ఉన్న విజయసాయి ఇప్పుడు ఏకంగా ఆయన అధికారంలోకి ఎందుకు రాలేడనే కారణాలు చెబుతున్నారు. త్వరలో జగన్ పాదయాత్ర చేస్తారు.. వాటిలో కొంత ఊపు వస్తుంది అని భావిస్తున్న వారికి విజయసాయి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచనలో పడేస్తున్నాయి.
This post was last modified on January 22, 2026 10:29 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. "కంటెంట్ ఉంటే కింగ్, లేదంటే ఆడియన్స్కి దొరికేస్తారు". ఒకప్పుడు కేవలం…
ఒకప్పుడు తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించడం కోసం ఏకంగా క్రీడాకారులను స్టేడియం నుంచి బయటకు పంపించిన ఐఏఎస్ అధికారి…
నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించి 238 పరుగులు బాదినా, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్…
ఇటీవల వచ్చిన 'ది రాజా సాబ్', గత ఏడాది చివర్లో వచ్చిన 'అఖండ 2'.. రెండు సినిమాలు కూడా పక్కా…
రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో…
తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన.. ఏ పార్టీలోకి నేను చేరడం లేదంటూనే విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు…