Political News

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తరచుగా జగన్ మళ్లీ వస్తే అనే మాట ప్రస్తావిస్తున్నారు. మళ్లీ రానివ్వొద్దంటూ చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారు. ఇక వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేస్తున్నారు. కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తనకు తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే వీరిద్దరూ ఇంతగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, జగన్ వైఖరిని గమనిస్తున్న వారు మాత్రం ఇక అంత కష్టపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే జగన్ తన రాజకీయ గ్రాఫ్‌ను తానే తగ్గించుకుంటున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన రాజధాని అంశంలో చేసిన తప్పులకు ఆయనే మూల్యం చెల్లించుకుంటున్నారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి ప్రధాన కారణం అమరావతి అంశమేనని పార్టీ నేతలకే తెలిసినా, జగన్ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

నిజానికి చంద్రబాబు అయినా, ఇతర నాయకులు అయినా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుంటున్నారు. 2018కి ముందు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు, తర్వాత ప్రజల్లో తన గ్రాఫ్ తగ్గుతోందని గ్రహించి వెంటనే దిశ మార్చుకున్నారు. కేంద్రంతో పోరాటానికి దిగారు. అది ఫలితమిచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే, ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడిన విషయం వాస్తవం. ఆ తర్వాత రాజకీయ అవసరాలు గుర్తించి మళ్లీ బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు.

అంటే రాజకీయాల్లో తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకోవడం నాయకులకి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. కానీ ఈ తరహా వ్యూహం, తప్పులు ఒప్పుకుని మారే గుణం జగన్‌లో ఎక్కడా కనిపించడం లేదన్నది ప్రధాన విమర్శ. పైగా తాను చేసిందే సరైనదన్న భావనతోనే ఆయన కొనసాగుతున్నారు. అందుకే మరోసారి అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ అన్నింటిని గమనించిన తర్వాత, జగన్ ఇక మారడు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పాతుకుపోతోంది. దాంతో కొంతమేర ఉన్న సానుభూతి కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని బట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు జగన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

This post was last modified on January 9, 2026 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

6 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

11 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

13 hours ago